గుట్కా, పాన్ మసాలా, పొగాకు లపై నిషేధం : ఢిల్లీ
- April 14, 2016
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే గుట్కా, పాన్ మసాలా, పొగాకు సంబంధిత పదార్థాల ఉత్పత్తులపై ఢిల్లీ ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ మేరకు ఆహార భద్రతా శాఖ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గుట్కా, పాన్ మసాలాలతో పాటు ఖైనీ, జర్దా పాన్ లపై కూడా నిషేధం కొనసాగనుంది. పొగాకు ఉత్పత్తుల అమ్మకం, కొనుగోలు, నిల్వలపై ఆరోగ్య విభాగం విధించిన నిషేధం నేటి నుంచి అమల్లోకి రానుంది.ఈ నిషేధం ఏడాది పాటు అమల్లో ఉంటుంది. కాగా ఫుడ్సేఫ్టీ యాక్ట్-2006 ప్రకారం గుట్కాలు, పాన మసాలాలతోపాటు చాప్టొబాకో, ఖైనీ, ఖరా, టొబాకో ఫ్లేవర్డ్ మసాలాల తయారీ, అమ్మకాలు, నిల్వ ఈ చట్టం పరిధిలోకి వస్తుందని ఢిల్లీ సర్కార్ పేర్కొంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు చేపడతామని సంబంధిత శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- తెలంగాణ సచివాలయంలో తప్పిన ప్రమాదం..
- ఇమ్మిగ్రేషన్ నిబంధనలు కఠినతరం: అతిక్రమిస్తే జరిమానా, జైలు శిక్ష
- షిర్డీ సాయి సేవలో రష్మిక, విక్కీ కౌశల్
- మూడో వన్డేలో ఇంగ్లాండ్ పై ఘన విజయం
- యూఏఈలో రమదాన్ : పవిత్ర మాసానికి ముందు భారీ డిస్కౌంట్లు..!!
- అబ్షర్ లో కొత్త సేవ.. దత్తత కుటుంబ సభ్యునికి పాస్పోర్ట్ జారీ..!!
- పోలీస్ అధికారిపై దాడి..అరబ్ మహిళకు ఏడాది జైలుశిక్ష..!!
- యూఏఈలో 20 మంది పర్యావరణవేత్తలకు బ్లూ వీసా ప్రదానం..!!
- కువైట్లో కీటకాలు కలిగిన ఆహార ఉత్పత్తులకు చోటు లేదు..!!
- సౌత్ అల్ బతినాలో ఓపెన్-ఎయిర్ సినిమా, ఎకో-టూరిజం హబ్..!!