తెలంగాణ హైకోర్టులో నూతన జడ్జిల ప్రమాణస్వీకారం

- August 16, 2022 , by Maagulf
తెలంగాణ హైకోర్టులో నూతన జడ్జిల ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌: తెలంగాణ హైకోర్టులో నూతన జడ్జిలు ప్రమాణస్వీకారం చేశారు.హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో మంగళవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్‌ భూయాన్‌ వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ఏనుగుల వెంకట వేణుగోపాల్‌, భీమపాక నగేశ్‌, పుల్లా కార్తీక్‌, కాజా శరత్‌ న్యాయమూర్తులుగా, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణస్వీకారం చేసి, బాధ్యతలు స్వీకరించారు.

కాగా, న్యాయవాదుల కోటాలో ఆరుగురు న్యాయమూర్తులు నియామకమైన విషయం తెలిసిందే. ఇప్పటిదాకా హైకోర్టులో 28 మంది జడ్జిలు ఉండగా.. కొత్త న్యాయమూర్తులతో మొత్తం సంఖ్య చేరింది. హైకోర్టు ఏర్పాటైనప్పుడు జడ్జిల సంఖ్య 24 ఉండగా.. ఆ సంఖ్యను 42కు పెంచుతూ ఇటీవల కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తగా ఆరుగురు ప్రమాణస్వీకారం చేయగా.. మరో ఎనిమిది జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com