ఆయిల్ స్ట్రైక్పై అప్రమత్తమైన కువైట్ పెట్రోలియం కార్పొరేషన్
- April 14, 2016
చమురు రంగంలో పనిచేస్తున్న కార్మికులు స్ట్రైక్కి పిలుపునివ్వడం పట్ల కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అప్రమత్తమైంది. కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమైనప్పటికీ, కార్మికులు చర్చలకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. అంతర్జాతీయంగా నెలకొన్న ముడిచమురు ధరల పతనం కారణంగా, పే హైక్ ఇబ్బందులు తలెత్తాయి. 20000 మంది కార్మికులు ఆందోళన చేస్తున్నారు ఈ విషయం గురించి. కార్మికులు ఇచ్చిన స్ట్రైక్ కాల్పై అప్రమత్తమైన కువైట్ ఆయిల్ కార్పొరేషన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సమాయత్తమవుతోంది. చర్చలకు వస్తే, కటింగ్ల విషయంలో పునరాలోచిస్తామని కువైట్ ఆయిల్ కార్పొరేషన్ చెప్పినా పే హైక్ విషయంలో వెనుకాడే ప్రసక్తే లేదని కార్మిక సంఘాలు అంటున్నాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







