రాజమౌళి శిష్యుడొస్తున్నాడోచ్.!
- August 18, 2022
75 ఏళ్ల స్వాతంత్ర్యం సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవ వారోత్సవాలు దేశం మొత్తం ఘనంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ‘హర్ ఘర్ తిరంగా’ పేరుతో ప్రతీ ఇంటిపైనా జాతీయ జెండా రెపరెపలాడుతూ ప్రతి ఒక్కరిలోనూ దేశభక్తిని చాటి చెబుతోంది.ఈ సందర్భంగా ఓ దేశ భక్తి చిత్రం చర్చకు వచ్చింది.
‘1770’ అనే టైటిల్తో రూపొందుతోన్న చిత్రమిది. ప్రముఖ బెంగాలీ రచయిత బంకించంద్ర ఛటర్జీ రచించిన ‘ఆనంద్మఠ్’ నవల ఆధారంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. తెలుగుతో సహా పలు భాషలలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారట. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా మోషన్ పోస్టర్ని ఘనంగా రిలీజ్ చేశారు.
రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో ‘ఆకాశ వాణి’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు అశ్విన్ గంగరాజు. ఈ సినిమాకి రాజమౌళి నుంచి బాగా సపోర్ట్ లభించిందట. ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథ, స్ర్కీన్ప్లే అందిస్తున్నారు.
దేశ భక్తి కథాంశం కావడంతో, ఈ సినిమాకి సంబంధించి పీరియాడిక్ సెట్స్, పీరియాడిక్ ఎమోషన్స్పై ఎక్కువ ఫోకస్ పెట్టబోతున్నారట. స్వాతంత్ర్య సమరానికి స్పూర్తి నింపిన యోధులెందరో ఈ సినిమాలో ప్రస్థావనకొస్తారట. నటీనటులు, మిగిలిన టెక్నీషియన్స్ వివరాలు దీపావళికి వెల్లడి చేయనున్నారట.
తాజా వార్తలు
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు
- ఢిల్లీలో భారీ పేలుడు..11 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!







