మొన్న పవన్-రేణు దేశాయ్, ఇప్పుడు ధనుష్ - ఐశ్వర్య: అలా కలిసిపోయారన్నమాట.!
- August 23, 2022
ఔను మేం విడిపోతున్నాం.. అంటూ ఈ మధ్య చాలా జంటలు విడిపోయి సెన్సేషనల్ అయ్యాయ్ సినీ వినీలాకాశంలో. అలాంటి జంటల్లో ఒకరైన ధనుష్, ఐశ్వర్య జంట మళ్లీ కలిసి కనిపించి, అందర్నీ షాక్కి గురి చేసింది.
అదేంటీ.? అభిప్రాయాలు కలవడం లేదంటూ, వారి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి విడాకులతో ముగింపు పలికేశారు కదా.. మళ్లీ కలిసిపోవడమేంటీ.? అనుకుంటున్నారా.? అవును నిజమే. జనవరిలో ఈ జంట విడాకులు తీసుకోవడం ద్వారా వైవాహిక బంధాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.
అయితే, వీరికి ఇద్దరు కుమారులున్న సంగతి కూడా తెలిసిందే. వారిలో పెద్ద కొడుకు యాత్ర, స్కూల్ ఈవెంట్కి సంబంధించి విడిపోయిన తల్లితండ్రులు ఒక్కటిగా కనిపించారు.
అలా అని కలిసిపోలేదనుకోండి. ఒక్కటిగా కనిపించారంతే. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ జంట కూడా ఇలాగే ఒక్కటిగా కనిపించారు. ఈ జంట కూడా విడాకులు తీసుకుని ఎవరి వ్యక్తిగత జీవితాలు వారు, తమకి నచ్చినట్లుగా జీవిస్తున్న సంగతి తెలిసిందే.
కానీ, ఈ జంటకు సంతానమైన అకీరానందన్ స్కూల్ ఈవెంట్ కోసం మళ్లీ పవన్ కళ్యాణ్, రేణూ దేశాయ్ కలసి కనిపించారు. ఆ ఫోటోలు అప్పుడు అంతే వైరల్ అయ్యాయ్. ఇప్పుడు ధనుష్, ఐశ్వర్య తమ కుమారులతో కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్.
కలిసి కనిపించినంత మాత్రాన ఈ మాజీ దంపతులు మళ్లీ ఒక్కటి కాలేదండోయ్. ఇదంతా కేవలం పిల్లల కోసం మాత్రమే.
తాజా వార్తలు
- టీజీ-20 ట్రెండ్ సెట్టర్.. తెలంగాణ క్రికెట్కు కొత్త బ్రాండ్!
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యుద్ధ ప్రభావం నుంచి కోలుకుంటున్న బహ్రెయిన్ దిగుమతులు..!!
- ఫాదర్ అమీర్ షేక్ హమద్ మృతిపై ప్రపంచ దేశాల సంతాపం..!!
- ఒమన్ ఆహార భద్రతకు కీలకంగా అల్ ధాహిరా పురోగతి..!!
- హోర్ముజ్ జలసంధి భద్రతపై సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- బార్డర్ పోస్టులు, సముద్ర చమురు ప్లాట్ఫామ్కు నష్టం: కువైట్
- వేసవి సెలవుల్లో ట్రాఫిక్కు బ్రేక్.. ఏడాది పొడవునా సాధ్యమేనా?
- బహ్రెయిన్లో సైరన్లు మోగింపు.. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రజలకు సూచన
- కువైట్ గగనతలంలోకి చొరబడిన శత్రు వైమానిక వస్తువులను కూల్చివేసిన వైమానిక రక్షణ వ్యవస్థ







