రిజర్వ్ ఫారెస్టులో ఎంటరైన వాహనం సీజ్
- August 28, 2022
దోహా: రిజర్వ్ ఫారెస్టులోకి ప్రవేశించి పర్యావరణానికి హాని కలిగించిన వాహనాన్ని పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. పర్యావరణ పర్యవేక్షణకు సంబంధించి 1995 నాటి చట్టం నెం. 32ను ఉల్లంఘించి, ఒక రిజర్వ్ గడ్డి మైదానంలోకి ప్రవేశించిన ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. 1995 నాటి చట్టం సంఖ్య. (32) ప్రకారం.. కార్లు, యంత్రాలు మొక్కల పర్యావరణ ప్రాంతాల గుండా వెళ్లడం నిషేధం. రిజర్వ్ ఫారెస్టులతో సహా సహజ పర్యావరణ పరిసరాలలో వాహనాలను నడపకూడదని, ఖతార్ పర్యావరణాన్ని కాపాడాలని, వాహనదారులు రోడ్లను ఉపయోగించాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు.. ప్రజలకు అధికారుల కీలక సూచనలు
- ఇరాన్ దాడులు, హోర్ముజ్ జలసంధి భద్రత పై చర్చించిన బహ్రెయిన్ రాజు–ఈజిప్ట్ అధ్యక్షుడు
- సురక్షిత సమాజం కోసం మహిళలతో చేతులు కలిపిన మల్కాజిగిరి పోలీసులు
- దుబాయ్ పోలీస్లో నాలుగో విడత 'సేఫ్టీ అంబాసిడర్స్' కార్యక్రమం ప్రారంభం
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడి యత్నం.. శత్రు దాడులను తిప్పికొట్టిన వైమానిక రక్షణ వ్యవస్థ
- ఇరాన్కు గూఢచర్యం చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన బహ్రెయిన్
- ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ తో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక భేటీ...
- లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీకి కువైట్ తొలి 15 ఏళ్ల గోల్డెన్ రెసిడెన్సీ
- ఢిల్లీ నుంచి తెలంగాణకు రోడ్ మ్యాప్..
- ముద్రగడ పద్మనాభం కన్నుమూత







