సింగపూర్ లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
- September 03, 2022
సింగపూర్: సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలానే ఈ సంవత్సరం కూడా వినాకయ చవితి పూజాకార్యక్రమం స్థానిక పిజిపి హాల్ నందు వినాయక నామ జయజయద్వానాలు నడుమ ఎంతో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది.గత రెండు సంవత్సరాల కోవిడ్ నిబంధనల తరువాత ప్రత్యక్షంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమంలో సుమారు 100 మంది బాలబాలికలు వారి స్వహస్తాలతో అరుదైన 21 పత్రాలతో బాల గణపతి పూజ చేశారు. ప్రత్యేకంగా అలంకరించబడి ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దిన గణనాధుని ప్రధాన విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పూజలో భాగంగా వేదపండితులు తెలిపిన గణేశ వైభవం, సంసృతి , సంప్రదాయాల వివరణ, పూజా వైశిష్టం పెద్దలతో పాటు పిల్లలు కూడా అత్యంత ఆసక్తితో ఆలకించారు.
ఈ సందర్భంగా సమాజ అధ్యక్షులు కోటిరెడ్డి మాట్లాడుతూ అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియచేస్తూ, పూజ లో పాల్గొన్న పిల్లలందరికీ ప్రత్యేకంగా మట్టితో చేసిన బాల గణపతి విగ్రహాన్ని అందించామని, అలాగే సుమారు 500 మందికి అన్నిరకాల 21 పత్రిని ఉచితంగా పంచి తృప్తి చెందామని తెలిపారు.కార్యక్రమ నిర్వాహకులు రవి సోమా మాట్లాడుతూ అందరికి ఆ వినాయకుని ఆశీస్సులు అందాలనే ఉద్దేశ్యంతో నిర్వహించిన పూజా కార్యక్రమానికి సుమారు 500 ప్రత్యక్షంగా,3500 మంది అంతర్జాలం ద్వారా వీక్షించడం జరిగిందని తెలిపారు. అందరి మంచికోసం నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం విజయవంతం కావడంలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారని తెలిపారు.కార్యవర్గసభ్యులకు, దాతలకు , పూజా కార్యక్రమంలో పాల్గొన్నవారికి, పిల్లలకు, స్వఛ్ఛంద సేవకులకు కార్యదర్శి సత్య చిర్ల కృతజ్ఞతలు తెలియజేసారు.


తాజా వార్తలు
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..
- వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్లో భారీ మార్పులు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!
- ఈద్ సెలవులు 3 లేదా 4 రోజులు ఉంటాయా?
- నెదర్లాండ్స్ పై భారత్ విజయం









