కరెంట్ కోత కారణాలపై విచారణ ప్రారంభం

- September 06, 2022 , by Maagulf
కరెంట్ కోత కారణాలపై విచారణ ప్రారంభం

మస్కట్: ఒమన్ లోని సుల్తానేట్ ప్రాంతంలో సోమవారం కరెంట్ కోతలతో ప్రజలు ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. చాలా సేపు కరెంట్ పోవటంతో ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా పనిచేయలేదు. ఐతే కరెంట్ కోతలకు సాంకేతిక సమస్యలు తలెత్తటమే కారణమని అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.ఐతే దీనికి పూర్తి కారణాలు తెలుసుకునేందుకు విచారణ చేపట్టారు. పబ్లిక్ సర్వీస్ అథారిటీ (PSRA) అధికారులు ఇబ్రీ విద్యుత్ స్టేషన్ ను సందర్శించారు. మెయిన్ కనెక్టెడ్ నెట్ వర్క్ లో తలెత్తిన సమస్య కారణంగానే కరెంట్ సప్లయ్ తో ఇబ్బందులు తలెత్తాయని గుర్తించారు. భవిష్యత్ లో మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను విచారణాధికారులు ప్రభుత్వానికి  సూచించనున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com