ప్రవాసులకు అందించే సేవలకు సర్వీస్ ఛార్జీల పై సమీక్ష
- September 08, 2022
కువైట్: కువైట్ ప్రభుత్వం అందించే సేవలకు వసూలు చేస్తున్న ఛార్జీలపై సమీక్ష జరపనుంది. ప్రస్తుతం కువైట్ వాసులకు, ప్రవాసులకు అందరికీ ఓకే విధంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఐతే ఈ ఛార్జీలను కువైట్ వాసులకు ఒక విధంగా ప్రవాసులకు మరో విధంగా ఉండేలా మార్పులు చేయనున్నారు. కువైట్ లో ఉన్న జనాభాలో 39 శాతం మాత్రమే స్థానికులు ఉన్నారు. మిగతా వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే. వీరందరికీ ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందించే సేవలకు ఒకే విధంగా ఛార్జీలు వసూలు చేస్తోెంది. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసులకు అందించే సేవలకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయాలని చాలా మంది కోరుతున్నారు. దీంతో ఈ మొత్తం సర్వీసు ఛార్జీల విషయంలో కువైట్ ప్రభుత్వం రివ్యూ చేయాలని నిర్ణయించింది. త్వరలో కొత్త సర్వీస్ ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో భద్రతా తనిఖీలు.. 187 మంది అరెస్ట్..!!
- ఔక్ఫ్ అధికారి అవినీతి కేసులో 22 ఏళ్ల జైలు శిక్ష..!!
- ఒమన్లో ఘనంగా ఓనం వేడుకలకు సన్నాహాలు..!!
- 674 పాఠశాలల వద్ద ట్రాఫిక్ భద్రతా చర్యలు పూర్తి..!!
- ఉమ్ అల్ కువైన్ మినీబస్ ప్రమాదంలో భారతీయుడి మృతి.. కేరళకు మృతదేహం తరలింపు..!!
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు







