ప్రవాసులకు అందించే సేవలకు సర్వీస్ ఛార్జీల పై సమీక్ష
- September 08, 2022
కువైట్: కువైట్ ప్రభుత్వం అందించే సేవలకు వసూలు చేస్తున్న ఛార్జీలపై సమీక్ష జరపనుంది. ప్రస్తుతం కువైట్ వాసులకు, ప్రవాసులకు అందరికీ ఓకే విధంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఐతే ఈ ఛార్జీలను కువైట్ వాసులకు ఒక విధంగా ప్రవాసులకు మరో విధంగా ఉండేలా మార్పులు చేయనున్నారు. కువైట్ లో ఉన్న జనాభాలో 39 శాతం మాత్రమే స్థానికులు ఉన్నారు. మిగతా వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే. వీరందరికీ ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందించే సేవలకు ఒకే విధంగా ఛార్జీలు వసూలు చేస్తోెంది. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసులకు అందించే సేవలకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయాలని చాలా మంది కోరుతున్నారు. దీంతో ఈ మొత్తం సర్వీసు ఛార్జీల విషయంలో కువైట్ ప్రభుత్వం రివ్యూ చేయాలని నిర్ణయించింది. త్వరలో కొత్త సర్వీస్ ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
- ఐపీఎల్ 2026 ప్రారంభం వాయిదా? కొత్త తేదీలు ఇవే!
- యూఏఈకి ‘కోల్డ్ వేవ్’ హెచ్చరిక
- ఇంటర్, పదవ తరగతి విద్యార్థులకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శుభాకాంక్షలు
- అజ్మాన్ పోలీస్ సరికొత్త రికార్డు
- ఎన్నారై తెలుగుదేశం కువైట్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు
- నకిలీ సంస్థ పేరిట మ్యూల్ ఖాతాలు: బ్యాంకు మేనేజర్ సహా నలుగురి అరెస్ట్
- 17 రోజులు బ్యాంకులకు సెలవులు
- TGSRTC: ‘మీ టికెట్’ యాప్తో బస్పాస్లు ఇక డిజిటల్
- 16 ఏళ్ల లోపు యూజర్ల కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త సేఫ్టీ అలర్ట్









