ప్రవాసులకు అందించే సేవలకు సర్వీస్ ఛార్జీల పై సమీక్ష

- September 08, 2022 , by Maagulf
ప్రవాసులకు అందించే సేవలకు సర్వీస్ ఛార్జీల పై సమీక్ష

కువైట్: కువైట్ ప్రభుత్వం అందించే సేవలకు వసూలు చేస్తున్న ఛార్జీలపై సమీక్ష జరపనుంది. ప్రస్తుతం కువైట్ వాసులకు, ప్రవాసులకు అందరికీ ఓకే విధంగా సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఐతే ఈ ఛార్జీలను కువైట్ వాసులకు ఒక విధంగా ప్రవాసులకు మరో విధంగా ఉండేలా మార్పులు చేయనున్నారు. కువైట్ లో ఉన్న జనాభాలో 39 శాతం మాత్రమే స్థానికులు ఉన్నారు. మిగతా వారంతా విదేశాల నుంచి వచ్చిన వారే. వీరందరికీ ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా అందించే సేవలకు ఒకే విధంగా ఛార్జీలు వసూలు చేస్తోెంది. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రవాసులకు అందించే సేవలకు ఎక్కువ ఛార్జీలు వసూలు చేయాలని చాలా మంది కోరుతున్నారు. దీంతో ఈ మొత్తం సర్వీసు ఛార్జీల విషయంలో కువైట్ ప్రభుత్వం రివ్యూ చేయాలని నిర్ణయించింది. త్వరలో కొత్త సర్వీస్ ఛార్జీలను ప్రకటించే అవకాశం ఉంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com