క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు
- September 08, 2022
యూఏఈ: క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్న కస్టమర్లను వ్యాపారులు దోచుకుంటున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసిన వారిపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ అదనపు బాదుడు భారీగా పెరిగింది. దీంతో కస్టమర్ల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది. ఇలా అదనంగా ఛార్జీలు వసూలు చేయటం కచ్చితంగా నేరమేనని అజ్మాన్స్ డిపాార్ట్ మెంట్ స్పష్టం చేసింది. అదనంగా ఛార్జీలు చెల్లించిన కస్టమర్లు వినియోగదారుల ఫోరమ్ లో కంప్లైంట్ చేసి తమ చెల్లించిన రుసుమును తిరిగి పొందవచ్చని తెలిపింది. క్రెడిట్ కార్డు పేమెంట్స్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని వ్యాపారులను ప్రభుత్వం హెచ్చరించింది. అటు కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ఈ ఏడాది కొత్త వ్యాపార లైసెన్సులు పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది మొదటి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది 2,637 కొత్త లైెసెన్స్ లు ఇచ్చినట్లు తెలిపింది. ఇది పోయిన ఏడాదితో పోల్చితే 16 శాతం అధికం.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో 11.4% తగ్గిన నాన్-ఆయిల్ ఎగుమతులు..!!
- దుబాయ్లో కొత్తగా 26 ప్రైవేట్ విద్యా సంస్థలు.. 17 వేలకుపైగా సీట్లు..!!
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో







