క్రెడిట్ కార్డ్స్ పేమెంట్స్ పై అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవు
- September 08, 2022
యూఏఈ: క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు చేస్తున్న కస్టమర్లను వ్యాపారులు దోచుకుంటున్నారు. క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేసిన వారిపై అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో ఈ అదనపు బాదుడు భారీగా పెరిగింది. దీంతో కస్టమర్ల నుంచి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. దీంతో గవర్నమెంట్ రియాక్ట్ అయ్యింది. ఇలా అదనంగా ఛార్జీలు వసూలు చేయటం కచ్చితంగా నేరమేనని అజ్మాన్స్ డిపాార్ట్ మెంట్ స్పష్టం చేసింది. అదనంగా ఛార్జీలు చెల్లించిన కస్టమర్లు వినియోగదారుల ఫోరమ్ లో కంప్లైంట్ చేసి తమ చెల్లించిన రుసుమును తిరిగి పొందవచ్చని తెలిపింది. క్రెడిట్ కార్డు పేమెంట్స్ అదనపు ఛార్జీలు వసూలు చేస్తే చర్యలు తప్పవని వ్యాపారులను ప్రభుత్వం హెచ్చరించింది. అటు కరోనా ఎఫెక్ట్ తగ్గటంతో ఈ ఏడాది కొత్త వ్యాపార లైసెన్సులు పెరిగినట్లు ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది మొదటి ఆరు నెలల కాలంతో పోలిస్తే ఈ ఏడాది 2,637 కొత్త లైెసెన్స్ లు ఇచ్చినట్లు తెలిపింది. ఇది పోయిన ఏడాదితో పోల్చితే 16 శాతం అధికం.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







