ఒమన్, సౌదీ ల మధ్య సముద్ర తీర రవాణా ఒప్పందం
- September 08, 2022
మస్కట్: ఒమన్, సౌదీ రెండు దేశాలు సముద్ర తీర రవాణా విషయంలో కొత్తగా ఒప్పందం చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల మధ్య సీ ట్రాన్స్ పోర్ట్ మరింత సులభతరం కానుంది. మస్కట్ లో జరిగిన సమావేశంలో ఇరు దేశాల రవాణా శాఖ మంత్రులు ఒప్పందంపై సంతకం చేశారు. ఈ ఒప్పందం ద్వారా ఒక దేశం జలాల్లోకి మరొక దేశం నౌకలు ఎలాంటి అభ్యంతరం లేకుండా ప్రయాణం చేస్తాయి. నౌక కెప్టెన్లకు సంబంధించిన వివరాలు, వారి సర్టిఫికెట్స్ కు సంబంధించిన సమాచారాన్ని రెండు దేశాలు ఇచ్చి పుచ్చుకోనున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సౌదీ, ఒమన్ మధ్య తీర ప్రాంత రవాణా మరింత పెరగనుంది. దీంతో రెండు దేశాలకు రవాణా ఖర్చు భారీగా తగ్గనుంది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- రియాద్లో రాజమండ్రి దంపతుల హత్య
- అమెరికాలో AI ప్రకంపనలు..
- మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- పార్కింగ్ ఫీజులు పెరుగుదలపై పార్కిన్ CEO క్లారిటీ..!!
- ఒమానీ–బహ్రెయిన్ బజార్ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- ఆప్టామిల్, బెబెలాక్ ఇన్ఫాంట్ ఫార్ములా పై SFDA హెచ్చరిక..!!
- ముహారక్ సౌక్ భవిష్యత్ పై కౌన్సిల్ సమీక్ష..!!
- కువైట్ జాతీయ దినోత్సవం..అద్భుతమైన వైమానిక ప్రదర్శన..!!
- విజిట్ ఖతార్..అల్ రువైస్ మారిటైమ్ హెరిటేజ్ ఫెస్టివల్..!!









