మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- February 28, 2026
ప్రతి నెలా మొదటి తారీఖున కొన్ని ప్రభుత్వ మరియు ఆర్థిక నిబంధనలు మారడం సహజం. అయితే, ఈ ఏడాది మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా సామాన్యుల జీవితాల పై ప్రభావం చూపే అనేక కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరల నుండి మొబైల్ సిమ్ నిబంధనల వరకు మారనున్న ఆ ప్రధాన అంశాలు ఇవే:
ప్రతి నెలా ఒకటో తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా మార్చి 1 నుండి LPG (వంటగ్యాస్ సిలిండర్) ధరలతో పాటు వాహనాలకు వాడే CNG, గృహ అవసరాల PNG మరియు విమాన ఇంధనం (ATF) ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది సామాన్యుల బడ్జెట్ పై నేరుగా ప్రభావం చూపుతుంది.
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పాత UTS (Unreserved Ticketing System) యాప్ను నిలిపివేసి, దాని స్థానంలో మరింత మెరుగైన ఫీచర్లతో కూడిన ‘RailOne’ అనే కొత్త యాప్ను మార్చి 1 నుండి ప్రవేశపెట్టనుంది. ప్రయాణికులు ఇకపై తమ జనరల్ టికెట్లను ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
సైబర్ నేరాలు మరియు ఫ్రాడ్ మెసేజ్లను అరికట్టేందుకు టెలికాం శాఖ కఠిన నిబంధనలను తీసుకువస్తోంది. దీని ప్రకారం మార్చి 1 నుండి ‘సిమ్-బైండింగ్’ (SIM-binding) ప్రక్రియ తప్పనిసరి అవుతుంది. అంటే, మీరు ఉపయోగించే ప్రతి మెసేజింగ్ యాప్ (ఉదాహరణకు WhatsApp లేదా ఇతర యాప్స్) ఖాతాను మీ ఫోన్లోని యాక్టివ్ సిమ్ కార్డుతో అనుసంధానం చేయాలి. దీనివల్ల నకిలీ ఖాతాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- ‘ఆధార్’ పేరిట ఆ మెసేజ్ లు నమ్మవద్దు–తెలంగాణ పోలీస్
- CJP తీరు పై స్టూడెంట్స్ విమర్శలు!
- సౌదీలో కొత్త హౌజింగ్ నిర్మాణ విధానానికి కేబినెట్ ఆమోదం..!!
- కువైట్లో నకిలీ ప్రభుత్వ స్టాంపుల ముఠా గుట్టురట్టు..!!
- యూఏఈలో వర్కర్లను నియమించుకునే వారికి కీలక సూచనలు..!!
- అమీర్తో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు..!!
- ఒమాన్లో ఆగస్టులో ఎండల తీవ్రత అధికం..!!
- షిర్డీ సాయిబాబాకు బంగారు ‘రామ్’ అక్షరాన్ని కానుకగా సమర్పించిన దుబాయ్ భక్తులు
- 25 టన్నుల కల్తీ మసాలా దినుసులు సీజ్ : సిపి సజ్జనార్
- మద్యం మత్తులో డ్రైవింగ్.. బహ్రెయిన్లో ఘోర ప్రమాదం







