మార్చి 1 నుండి మారనున్న నిబంధనలు ఇవే..
- February 28, 2026
ప్రతి నెలా మొదటి తారీఖున కొన్ని ప్రభుత్వ మరియు ఆర్థిక నిబంధనలు మారడం సహజం. అయితే, ఈ ఏడాది మార్చి 1 నుండి దేశవ్యాప్తంగా సామాన్యుల జీవితాల పై ప్రభావం చూపే అనేక కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. గ్యాస్ ధరల నుండి మొబైల్ సిమ్ నిబంధనల వరకు మారనున్న ఆ ప్రధాన అంశాలు ఇవే:
ప్రతి నెలా ఒకటో తేదీన చమురు మార్కెటింగ్ సంస్థలు ఇంధన ధరలను సమీక్షిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా మార్చి 1 నుండి LPG (వంటగ్యాస్ సిలిండర్) ధరలతో పాటు వాహనాలకు వాడే CNG, గృహ అవసరాల PNG మరియు విమాన ఇంధనం (ATF) ధరల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇది సామాన్యుల బడ్జెట్ పై నేరుగా ప్రభావం చూపుతుంది.
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పాత UTS (Unreserved Ticketing System) యాప్ను నిలిపివేసి, దాని స్థానంలో మరింత మెరుగైన ఫీచర్లతో కూడిన ‘RailOne’ అనే కొత్త యాప్ను మార్చి 1 నుండి ప్రవేశపెట్టనుంది. ప్రయాణికులు ఇకపై తమ జనరల్ టికెట్లను ఈ కొత్త ప్లాట్ఫామ్ ద్వారానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
సైబర్ నేరాలు మరియు ఫ్రాడ్ మెసేజ్లను అరికట్టేందుకు టెలికాం శాఖ కఠిన నిబంధనలను తీసుకువస్తోంది. దీని ప్రకారం మార్చి 1 నుండి ‘సిమ్-బైండింగ్’ (SIM-binding) ప్రక్రియ తప్పనిసరి అవుతుంది. అంటే, మీరు ఉపయోగించే ప్రతి మెసేజింగ్ యాప్ (ఉదాహరణకు WhatsApp లేదా ఇతర యాప్స్) ఖాతాను మీ ఫోన్లోని యాక్టివ్ సిమ్ కార్డుతో అనుసంధానం చేయాలి. దీనివల్ల నకిలీ ఖాతాలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.
తాజా వార్తలు
- కువైట్లో T5 టెర్మినల్ పునఃప్రారంభం పై సోషల్ మీడియాలో వైరల్ వార్తలు ఫేక్: DGCA స్పష్టీకరణ
- IPL 2026: కోల్కతా పై చెన్నై ఘన విజయం
- దోహాలో ఘనంగా డా.బి.ఆర్.అంబేద్కర్ జయంతి వేడుకలు
- శంషాబాద్లో నకిలీ CISF అధికారి గుట్టురట్టు!
- ఏప్రిల్ 15 నుంచి కొత్త జరిమానా నిబంధనలు అమలు
- ట్రంప్తో 40 నిమిషాలు మాట్లాడిన ప్రధాని మోదీ..
- బిహార్ కొత్త సీఎం గా సామ్రాట్ చౌదరి..!
- భారత్ లో ‘టెక్నోవర్స్ హ్యాకథాన్ 2026’ ప్రారంభం!
- తెలంగాణలో వీఐపీ సెక్యూరిటీ తగ్గింపు: డీజీపీ శివధర్రెడ్డి
- ఛత్తీస్ గఢ్ లోని వేదాంత పవర్ ప్లాంట్లో భారీ పేలుడు, 9 మంది మృతి









