గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
- September 09, 2022విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం సాయంత్రం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఈ బంగారం పట్టుకున్నట్టు సమాచారం.హైదరాబాద్ నుంచి వచ్చిన కస్టమ్స్ స్పెషల్ టీమ్ గురువారం సాయంత్రం నుంచి గన్నవరం విమానాశ్రయంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. ఒక అధికారి భార్య దుబాయ్ నుంచి వస్తూ బంగారం తీసుకుని వచ్చినట్టు కస్టమ్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైనట్టు సమాచారం.
సదరు మహిళకు ఎయిర్ ఇండియా సంస్థలోని పలువురు సిబ్బంది సహకరించినట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరు సిబ్బంది ఉండగా, వారిలో ఒకరు కింది స్థాయి ఉద్యోగి అని, మరొకరు పై స్థాయి ఉద్యోగి అని సమాచారం. బంగారం తీసుకొని వచ్చిన మహిళ ను కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు సహకరించిన సిబ్బందిని కూడా విచారణ చేస్తున్నట్టు తెలిసింది. సిబ్బంది సహకారం కూడా ఉండటం గమనిస్తే..గన్నవరం విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఎన్ని జరిగి ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే మొదటిసారి అయ్యుండదని, ఇంతకుముందు ఎలాంటి ఘటనలు జరిగాయనే కోణంలోనూ విచారణ చేస్తున్నారని తెలిసింది.ఈ ఘటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బంది విషయంలో ఆ సంస్థ కఠిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంటుంది.దీంతో పాటు గన్నవరం విమానాశ్రయంలో పటిష్టంగా తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకునే అవకాశముంది.
తాజా వార్తలు
- పాకిస్థాన్లో అధికారికంగా ప్రారంభమైన యోగా
- నరేంద్ర మోడీ మరోసారి ప్రధాన మంత్రి కావాలి..గల్ప్ కార్మికుల మద్దతు..!
- ప్రత్యేక లేబర్ డే ట్రీట్.. 16 మంది కార్మికులకు అరుదైన అవకాశం
- రవాబీ హైపర్మార్కెట్లో మ్యాంగో ఫియస్టా ప్రారంభం
- అవినీతి లేదా రాజద్రోహానికి పాల్పడిన అధికారులకు 'హిస్ ఎక్సలెన్సీ' బిరుదు తొలగింపు
- వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2024..18 స్థానాలు ఎగబాకిన ఒమన్
- దుబాయ్ ఆర్ట్ గ్యాలరీలో అమ్మకానికి 'పురాతన సముద్రపు డ్రాగన్' పుర్రె
- తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు పెంపు నోటిఫికేషన్లు
- తిరుమలలో భక్తుల రద్దీ..
- ఫేక్ యాప్స్కు గూగుల్ చెక్