గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత..
- September 09, 2022
విజయవాడ: గన్నవరం విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గురువారం సాయంత్రం దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ఈ బంగారం పట్టుకున్నట్టు సమాచారం.హైదరాబాద్ నుంచి వచ్చిన కస్టమ్స్ స్పెషల్ టీమ్ గురువారం సాయంత్రం నుంచి గన్నవరం విమానాశ్రయంలో దర్యాప్తు చేస్తున్నట్టు తెలిసింది. ఒక అధికారి భార్య దుబాయ్ నుంచి వస్తూ బంగారం తీసుకుని వచ్చినట్టు కస్టమ్స్ అధికారుల పరిశీలనలో వెల్లడైనట్టు సమాచారం.
సదరు మహిళకు ఎయిర్ ఇండియా సంస్థలోని పలువురు సిబ్బంది సహకరించినట్టు తెలుస్తోంది. వారిలో ఇద్దరు సిబ్బంది ఉండగా, వారిలో ఒకరు కింది స్థాయి ఉద్యోగి అని, మరొకరు పై స్థాయి ఉద్యోగి అని సమాచారం. బంగారం తీసుకొని వచ్చిన మహిళ ను కస్టమ్స్ అధికారులు విచారిస్తున్నట్లు సమాచారం. ఆమెతో పాటు సహకరించిన సిబ్బందిని కూడా విచారణ చేస్తున్నట్టు తెలిసింది. సిబ్బంది సహకారం కూడా ఉండటం గమనిస్తే..గన్నవరం విమానాశ్రయంలో ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు ఎన్ని జరిగి ఉంటాయోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే మొదటిసారి అయ్యుండదని, ఇంతకుముందు ఎలాంటి ఘటనలు జరిగాయనే కోణంలోనూ విచారణ చేస్తున్నారని తెలిసింది.ఈ ఘటన నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా సిబ్బంది విషయంలో ఆ సంస్థ కఠిన నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంటుంది.దీంతో పాటు గన్నవరం విమానాశ్రయంలో పటిష్టంగా తనిఖీలు నిర్వహించేందుకు చర్యలు తీసుకునే అవకాశముంది.
తాజా వార్తలు
- తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రయాణం ప్రారంభించిన స్పోర్ట్స్ హ్యాకథాన్ టార్చ్
- కీలక మ్యాచ్లో విండీస్పై భారత్ ఘన విజయం..
- ఖతార్ రక్షణ మంత్రి నుంచి షేక్ హమ్దాన్కు ఫోన్ కాల్
- కువైట్ రక్షణ మంత్రి నుంచి షేఖ్ హమ్దాన్కు ఫోన్ కాల్
- యూఏఈ ప్రైవేట్ రంగానికి అడ్వైజరీ
- అమరావతిలో 'న్యాయ' మణిహారం: రాజధాని ప్రస్థానంలో మరో మైలురాయి!
- ఇరాన్, గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్
- భారీ నిరసనలు..శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
- ఇరాన్ తాత్కాలిక సుప్రీం లీడర్గా అలిరెజా అరాఫీ నియామకం
- ఇరాన్ నుంచి ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఖతార్ రక్షణ మంత్రిత్వ శాఖ









