నూకల ఎగుమతి పై భారత్ నిషేధం
- September 09, 2022
న్యూఢిల్లీ: నూకల ఎగుమతిపై కేంద్ర నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఎగుమతి పాలసీ సవరించబడిన కారణంగా నూకల ఎగుమతిపై నిషేధం విధించినట్లు కేంద్రం వెల్లడించింది. అయితే ఉత్తర్వులు రాకముందు నౌకల్లోకి ఎక్కించిన నూకలను సెప్టెంబర్ 15 వరకు అనుమతించబడతాయని తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఖరీఫ్ సీజన్లో వరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో..ధరలు పెరగకుండా నియంత్రించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. అటు వరి ధాన్యం, బ్రౌన్ రైస్, సెమీ మిల్డ్ రైస్పై భారత్ 20 శాతం ఎక్సైజ్ డ్యూటీని విధించింది. సెప్టెంబర్ 9 నుంచి ఈ సుంకం అమల్లోకి రానుంది. ఇక 2021–22లో భారత్ 21 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. తాజా ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది బియ్యం ఎగుమతులు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.
ఈ ఖరీఫ్ సీజన్లో వరి సాగు విస్తీర్ణం గత సీజన్ కంటే 6 శాతం తక్కువగా నమోదైంది. మొత్తంగా రైతులు 383.99 లక్షల హెక్టార్లలో మాత్రమే వరిని సాగు చేస్తున్నారు. వరి పంట ఎక్కువగా పండే ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది. అంటే 70 శాతం మాత్రమే వర్షాలు పడ్డాయి. దీంతో రైతులు వరి పంటను తక్కువగా సాగు చేశారు. ఈ ఖరీఫ్లో ఇప్పటివరకు తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేయడం వల్ల ఆహారధాన్యాల కొరత ఏర్పడే అవకాశాలున్నాయన్న ఆందళనతో కేంద్ర…నూకల ఎగుమతిపై నిషేధం విధించింది.
మరోవైపు ఈ ఏడాది మే లో కేంద్ర గోధుమల ఎగుమతిపై కూడా నిషేధం విధించింది. రష్యా ఉక్రేయిన్ యుద్ధం నేపథ్యంలో ఆహార ధాన్యాల ధరలు పెరుగుతుండటంతో..ఆహార భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. అలాగే పొరుగు దేశాల అవసరాలను తీర్చడం కోసం కూడా గోధుమల ఎగుమతిపై ఆంక్షలు విధించినట్లు పేర్కొంది. గోధుమలతో పాటు..గోధుమ పిండి, మైదా, రవ్వ, హోల్ మీల్ ఆటా వంటి ఇతర గోధుమ సంబంధిత ఉత్పత్పులపై కూడా ఆంక్షలు విధించింది.
తాజా వార్తలు
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!







