బహ్రెయిన్ నుంచి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న వ్యక్తి ఇండియాలో అరెస్ట్
- September 09, 2022
మనామా: బహ్రెయిన్ నుంచి ఇండియా కు వచ్చిన ఓ వ్యక్తి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్ అధికారులకు పట్టుబడ్డాడు. కేరళలోని కలికట్ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడు కొన్ని రోజుల క్రితం బహ్రెయిన్ కు వెళ్లాడు. అక్కడ నుంచి ఇండియాకు వచ్చే క్రమంలో అక్రమంగా బంగారం తీసుకొచ్చాడు. అతని దగ్గర నుంచి 800 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు కేరళకు చెందిన 29 ఏళ్ల ఉస్మాన్ గా గుర్తించారు. వారం రోజుల వ్యవధిలో ఇది రెండో సంఘటన. గత వారం ఇదే ఎయిర్ పోర్ట్ లో బ్రహెయిన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 2.4 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ట్యాక్స్ నుంచి తప్పించుకునేందుకు చాలా మంది బహ్రెయిన్ నుంచి ఇలా అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- భారతీయులకు అనవసర ప్రయాణాలు మానుకోవాలని భారత రాయబార కార్యాలయం సూచన
- రష్యా అధ్యక్షుడి నుంచి బహ్రెయిన్ రాజుకు ఫోన్ కాల్
- బ్లాక్ సంస్థలో భారీగా ఉద్యోగాల కోత
- సౌదీ, బహ్రెయిన్ పాలకులకు మోదీ ఫోన్
- ఇరాన్ పై దాడుల నిర్ణయంతో ట్రంప్ పై అమెరికాలో రాజకీయ వివాదం
- దుబాయ్ ఎయిర్పోర్ట్స్లో పరిమిత విమానాల పునఃప్రారంభం
- జల్లికట్టు పోటీల్లో విషాదం ముగ్గురు మృతి..76 మందికి పైగా గాయాలు
- ఏసీ బస్సు లో టికెట్ ధరలు తగ్గింపు
- అబుదాబిలోని BAPS హిందూ మందిర్ మార్చి 9 వరకు క్లోజ్..!!
- ఇరాన్ పై దాడి..లాబీయింగ్ ఆరోపణలను ఖండించిన సౌదీ..!!









