ఫ్లోర్ మిల్స్ ద్వారా బడి పిల్లలకు భోజనం-కువైట్ విద్యాశాఖ

- September 10, 2022 , by Maagulf
ఫ్లోర్ మిల్స్ ద్వారా బడి పిల్లలకు భోజనం-కువైట్ విద్యాశాఖ

కువైట్: కువైట్ లో బడి పిల్లలకు భోజనం అందించే ప్రాజెక్ట్ ను మళ్లీ ఈ ఏడాది నుంచి ప్రారంభించనున్నారు. కువైట్ లో 6 ఏళ్ల లోపు బడి పిల్లలకు ప్రభుత్వమే పౌష్టికాహారం, భోజనం అందిస్తుంది. ఐతే కరోనా కారణంగా రెండేళ్ల పాటు పిల్లలకు భోజనం అందించటాన్ని నిలిపివేశారు. ఈ ఏడాది మళ్లీ పిల్లలకు భోజనం అందించే ప్రాజెక్ట్ ను పునరుద్ధరిస్తున్నట్లు కువైట్ విద్యాశాఖ తెలిపింది. కువైట్ లోని పిండి మిల్లులలో పిల్లలకు తాత్కాలికంగా భోజనం సిద్ధం చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ఫ్లోర్ మిల్స్ యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. కొన్ని నెలల పాటు ఫ్లోర్ మిల్స్ లలో పిల్లల కోసం భోజనం సిద్ధం చేయించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. పరిస్థితులన్నీ పూర్తిగా చక్కబడిన తర్వాత పిల్లల కోసం భోజనం సిద్ధం చేసేందుకు స్వంతంగా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com