పిల్లల్లో పెరుగుతున్న ఫ్లూ జ్వరాలు. వ్యాక్సినేషన్ చేయించాలంటున్న డాక్టర్లు

- September 10, 2022 , by Maagulf
పిల్లల్లో పెరుగుతున్న ఫ్లూ జ్వరాలు. వ్యాక్సినేషన్ చేయించాలంటున్న డాక్టర్లు

యూఏఈ: వాతావారణంలో వస్తున్న అనుహ్య మార్పుల కారణంగా ఫ్లూ జ్వరాలు విజృంభిస్తున్నాయి. పెద్దలు, పిల్లలు చాలా మంది ఫ్లూ బారిన పడుతున్నారు. దీంతో డాక్టర్లు పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వారికి ఫ్లూ వ్యాక్సినేషన్ చేయించాలంటున్నారు. కరోనా మహమ్మరి కారణంగా దాాదాపుగా రెండేళ్లు పిల్లలు స్కూల్ కు వెళ్లలేదు. సెప్టెంబర్ లో మళ్లీ స్కూల్స్ రీ ఓపెన్ అవుతున్నాయి. ఇదే సమయంలో ఫ్లూ జ్వరాలు పెద్ద ఎత్తున ప్రబలుతుండటంతో పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. ముఖ్యంగా తల్లితండ్రులు తమ పిల్లలకు ఫ్లూ వ్యాక్సినేషన్ తప్పకుండా వేయించాలని డాక్టర్లు చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com