పాకిస్థాన్లో సౌదీ విమానానికి తప్పిన ప్రమాదం
- September 12, 2022
జెడ్డా: పాకిస్థాన్లోని కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ ప్రయాణీకుల విమానానికి పెను ప్రమాదం తప్పింది. బోయింగ్ 330 విమానం జెడ్డా నుంచి పాకిస్థాన్కు ప్రయాణికులతో వెళ్లింది. శుక్రవారం కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా.. ఇంజిన్ను పక్షి ఢీకొట్టింది. అయితే, పైలట్ విమానాన్ని విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రాయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై సౌదీ ఎయిర్లైన్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రయాణీకుల విమానం SV 700 ఇంజిన్ నంబర్ 1ను పక్షి ఢీకొట్టిందన్నారు. విమానాన్ని తాత్కాలికంగా నిలిపివేశామన్నారు. విమాన ఇంజినీరింగ్ సిబ్బంది మరమ్మతు పనులు ప్రారంభించారని తెలిపారు.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







