నాలుగేళ్ల స్టూడెంట్ మృతిపై ఖతార్ విద్యాశాఖ సీరియస్

- September 14, 2022 , by Maagulf
నాలుగేళ్ల స్టూడెంట్ మృతిపై ఖతార్ విద్యాశాఖ సీరియస్

ఖతార్: 2022 సెప్టెంబరు 11న నాలుగేళ్ల మిన్సా మరియం జాకబ్ ప్రాణాలను బలిగొన్న ప్రైవేట్ కిండర్ గార్టెన్‌పై విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ (MoEHE) కఠిన చర్యలు తీసుకుంది. స్టూడెంట్ ప్రాణాలను తీసిన అల్ వక్రాలోని స్ప్రింగ్‌ఫీల్డ్ కిండర్ గార్టెన్‌ను మూసివేయాలని నిర్ణయించింది. విచారణలో పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం రుజువైన తరువాత అత్యంత కఠిన చర్యలు తీసుకోనున్నట్లు MoEHE తెలిపింది. విద్యాసంస్థల్లో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని మంత్రిత్వ శాఖ ట్విట్టర్‌లో పేర్కొంది. స్ప్రింగ్‌ఫీల్డ్ కిండర్ గార్టెన్‌కు చెందిన KG 1 స్టూడెంట్ మరియం కిండర్ గార్టెన్ బస్సుల్లో ఒకదానిలో ఊపిరాడక మరణించడం అందరిని కలచివేసింది. ఈ సంఘటనపై పౌరులు, నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com