ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్
- September 16, 2022
రియాద్: ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్ అయిన హరమైన్ ఎక్స్ ప్రెస్ ను నడుపనున్నారు. ప్రపంచం నలుమాలల నుంచి ఉమ్రా యాత్రకు పర్యాటకులు వస్తుంటారు. వారంతా పవిత్రమైన మక్కా, మదీనా లను సందర్శిస్తారు. ఐతే మక్కా, మదీనా లను సందర్శించే యాత్రికులకు టైమ్ సేవ్ అయ్యే విధంగా హై స్పీడ్ ట్రైన్ ను నడుపనున్నారు. ఈ ట్రైన్ గంటకు గరిష్టంగా 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైళ్లో వెళ్లే వారు రెండున్నర గంటల్లో మక్కా నుంచి మదీనాకు మదీనా నుంచి మక్కా కు చేరుకుంటారు. టికెట్ ధర 40 రియా ల నుంచి 150 రియాల వరకు ఉంటుంది. దాదాపు 4 వందల మంది ఒకేసారి ట్రైన్ లో ప్రయాణించవచ్చు. ఈ అవకాశాన్ని ఉమ్రా యాత్రకు వచ్చే సందర్శకులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- NRI ఓటర్ల హక్కుల పరిరక్షణకు అవగాహన పెంచాలి: సౌదీ తెలుగు అసోసియేషన్
- సౌదీలో డెలివరీ యాప్లను హెచ్చరించిన ట్రాన్స్పోర్ట్ అథారిటీ..!!
- దోఫార్లో సైబర్ మోసాల ముఠా అరెస్ట్..!!
- యూఏఈలో 50°C దాటనున్న ఉష్ణోగ్రతలు..వర్షాలతో ఉపశమనం..!!
- ఆకట్టుకున్న 'ఇమేజ్ ఇన్ బహ్రెయిన్' మహిళల ఫోటోగ్రఫీ పోటీ..!!
- రాస్ లఫాన్ ఘటనపై చర్చించిన అమీర్, ప్రధాని మోదీ..!!
- సమ్మర్ లో అగ్ని ప్రమాదాలు..కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- తెలంగాణకు వర్షాల అలర్ట్..
- ఎన్ఆర్ఐల ఓటు హక్కులను కాపాడాలి: సౌదీ తెలుగు అసోసియేషన్ విజ్ఞప్తి
- సాయికృష్ణ కేసులో సంచలనం..రిమాండ్ రిపోర్టులో బయటపడ్డ షాకింగ్ విషయాలు!







