ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్
- September 16, 2022
రియాద్: ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్ అయిన హరమైన్ ఎక్స్ ప్రెస్ ను నడుపనున్నారు. ప్రపంచం నలుమాలల నుంచి ఉమ్రా యాత్రకు పర్యాటకులు వస్తుంటారు. వారంతా పవిత్రమైన మక్కా, మదీనా లను సందర్శిస్తారు. ఐతే మక్కా, మదీనా లను సందర్శించే యాత్రికులకు టైమ్ సేవ్ అయ్యే విధంగా హై స్పీడ్ ట్రైన్ ను నడుపనున్నారు. ఈ ట్రైన్ గంటకు గరిష్టంగా 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైళ్లో వెళ్లే వారు రెండున్నర గంటల్లో మక్కా నుంచి మదీనాకు మదీనా నుంచి మక్కా కు చేరుకుంటారు. టికెట్ ధర 40 రియా ల నుంచి 150 రియాల వరకు ఉంటుంది. దాదాపు 4 వందల మంది ఒకేసారి ట్రైన్ లో ప్రయాణించవచ్చు. ఈ అవకాశాన్ని ఉమ్రా యాత్రకు వచ్చే సందర్శకులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









