ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్

- September 16, 2022 , by Maagulf
ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్

రియాద్: ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్ అయిన  హరమైన్ ఎక్స్ ప్రెస్ ను  నడుపనున్నారు. ప్రపంచం నలుమాలల నుంచి ఉమ్రా యాత్రకు పర్యాటకులు వస్తుంటారు. వారంతా పవిత్రమైన మక్కా, మదీనా లను సందర్శిస్తారు. ఐతే మక్కా, మదీనా లను సందర్శించే యాత్రికులకు టైమ్ సేవ్ అయ్యే విధంగా హై స్పీడ్ ట్రైన్ ను నడుపనున్నారు. ఈ ట్రైన్ గంటకు గరిష్టంగా 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైళ్లో వెళ్లే వారు రెండున్నర గంటల్లో మక్కా నుంచి మదీనాకు మదీనా నుంచి మక్కా కు చేరుకుంటారు. టికెట్ ధర 40 రియా ల నుంచి 150 రియాల వరకు ఉంటుంది. దాదాపు 4 వందల మంది ఒకేసారి ట్రైన్ లో ప్రయాణించవచ్చు. ఈ అవకాశాన్ని ఉమ్రా యాత్రకు వచ్చే సందర్శకులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com