ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్
- September 16, 2022
రియాద్: ఉమ్రా యాత్రికుల కోసం మక్కా నుంచి మదీనాకు హై స్పీడ్ ట్రైన్ అయిన హరమైన్ ఎక్స్ ప్రెస్ ను నడుపనున్నారు. ప్రపంచం నలుమాలల నుంచి ఉమ్రా యాత్రకు పర్యాటకులు వస్తుంటారు. వారంతా పవిత్రమైన మక్కా, మదీనా లను సందర్శిస్తారు. ఐతే మక్కా, మదీనా లను సందర్శించే యాత్రికులకు టైమ్ సేవ్ అయ్యే విధంగా హై స్పీడ్ ట్రైన్ ను నడుపనున్నారు. ఈ ట్రైన్ గంటకు గరిష్టంగా 300 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైళ్లో వెళ్లే వారు రెండున్నర గంటల్లో మక్కా నుంచి మదీనాకు మదీనా నుంచి మక్కా కు చేరుకుంటారు. టికెట్ ధర 40 రియా ల నుంచి 150 రియాల వరకు ఉంటుంది. దాదాపు 4 వందల మంది ఒకేసారి ట్రైన్ లో ప్రయాణించవచ్చు. ఈ అవకాశాన్ని ఉమ్రా యాత్రకు వచ్చే సందర్శకులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- చరిత్ర సృష్టించిన కింగ్ ఛార్లెస్
- బస్సు డ్రైవర్ను సత్కరించిన దుబాయ్..!!
- 259 మంది అనుమానితుల పై విచారణ..97 మంది అరెస్ట్..!!
- డిజిటల్ బ్యాంకింగ్ ప్రమాదాల పై ప్రజలకు అవగాహన..!!
- గల్ఫ్ ట్రాఫిక్ వీక్..పెడెస్ట్రియన్ పమాదాలు తగ్గించడం పై ఫోకస్..!!
- బ్యాంకు ఫ్రాడ్, పాస్ పోర్ట్ కుంభకోణంలో ఇద్దరు అరెస్ట్..!!
- గవర్నర్ శుక్లాను కలిసిన డీజీపీ సీవీ ఆనంద్
- ఏపీకి రూ.15,000 కోట్ల భారీ ప్రాజెక్టు!
- టీడీపీ సీనియర్ నేత వల్లభనేని బాబురావు కన్నుమూత
- హార్ముజ్ జలసంధి పై ఇరాన్ పంజా: కొత్త సముద్ర నిబంధనలు అమలు!









