ఓ చిన్నారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ..
- April 17, 2016
కాన్పూర్: నిండా పదేళ్లు కూడా నిండని ఓ చిన్నారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. అది కూడా ఏవైనా సమస్యల గురించా అంటే కానే కాదట. ప్రధాని మోదీ పాలనను మెచ్చుకుంటూ ఉత్తరప్రదేశ్కు చెందిన ఓ చిన్నారి లేఖ రాసింది.కాన్పూర్కు చెందిన అదితి అనే చిన్నారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాసింది. ప్రభుత్వ పథకాలు, పాలనపై ఈ లేఖలో ప్రశంసల జల్లు కురిపించింది. దేశ ప్రజల కోసం ఎన్నో పథకాలు ప్రారంభిస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ చిన్నారి ఉత్తరానికి ప్రత్యుత్తరం కూడా వచ్చిందట. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి ఈ విషయాన్ని తెలిపింది. తనకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి థాంక్యూ అంటూ లేఖ వచ్చిందని.. అందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పింది. భవిష్యత్తులో మోదీ పథకాలపై మరిన్ని లేఖలు రాస్తానని చెబుతోంది అదితి.
తాజా వార్తలు
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..







