ఓట్లు కొనుగోలు కేసులో ఏడుగురు వ్యక్తులు అరెస్టు

- September 17, 2022 , by Maagulf
ఓట్లు కొనుగోలు కేసులో ఏడుగురు వ్యక్తులు అరెస్టు

కువైట్ సిటీ: ఓట్లు కొనుగోలు చేసిన ఆరోపణలపై ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేసి, వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి విచారణకు పంపినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ(MOI) వెల్లడించింది. ఈ సందర్భంగా నిందితుల వద్ద నుంచి KD20,000తోపాటు ఓటర్ల జాబితాలను స్వాధీనం చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.  సెర్చ్, ఇన్వెస్టిగేషన్ ఆపరేషన్ల ద్వారా మినల్ సెక్యూరిటీ సెక్టార్ చట్టాన్ని ఉల్లంఘించి ఓట్ల కొనుగోలు కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న ఇంటిని గుర్తించినట్లు MOI పేర్కొంది. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రలోభాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com