మదీనాలో కొత్తగా బంగారం, రాగి గనుల గుర్తింపు
- September 17, 2022
సౌదీ: మదీనాలో కొత్త బంగారం, రాగి ఖనిజ గనులను కనుగొన్నట్లు సౌదీ అరేబియా ప్రకటించింది. బంగారు గనులు మదీనా ప్రాంతంలోని అబా అల్-రాహా సరిహద్దుల్లో ఉన్నాయని సౌదీ జియోలాజికల్ సర్వే సోషల్ మీడియా పోస్ట్లో తెలిపింది. దీనితోపాటు అల్-మాదిక్, మదీనాలోని నాలుగు ప్రాంతాల్లో రాగి గనులను గుర్తించినట్లు తెలిపింది. అంతకుముందు సౌదీలో 5,300 ఖనిజ గనులు ఉన్నాయని సౌదీ జియాలజిస్ట్స్ కోఆపరేటివ్ అసోసియేషన్ చైర్మన్ ప్రొఫెసర్ అబ్దుల్ అజీజ్ బిన్ లాబోన్ చెప్పారు. వీటిలో వైవిధ్యమైన మెటల్, నాన్-మెటల్ శిలలు, నిర్మాణ వస్తువులు, అలంకార శిలలు, రత్నాల గనులు ఉన్నాయని ఆయన వివరించారు. తాజాగా గుర్తించిన గనులు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షించి జాతీయ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి దోహదపడతాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. కొత్తగా కనుగొన్న బంగారం, రాగి గనుల ద్వారా $533 మిలియన్ల పెట్టుబడి వస్తుందని, 4,000 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ ఏర్పాటు చేసిన విజన్ 2030 లక్ష్యాలలో మైనింగ్ ఒకటని, మైనింగ్ రంగంలోకి $32 బిలియన్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రణాళికలను రూపొందించినట్లు సౌదీ అరేబియా పరిశ్రమ, ఖనిజ వనరుల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







