విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు: వెంకయ్య నాయుడు
- September 17, 2022
హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 17పై సస్పెన్స్ కొనసాగుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఆసక్తికర పోరు నడుస్తోంది.ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి విమోచన దినోత్సవ వేడుకల కోసం హైదరాబాద్కు విచ్చేసిన విషయం తెలిసిందే.
మరోవైపు.. శనివారం ఉదయం విమోచన దినోత్సవం సందర్భంగా గన్పార్క్ వద్ద మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్.. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. సర్దార్ వల్లభాయ్ పటేల్ అఖండ దేశభక్తుడు. దేశ సమైక్యతకు బలమైన నిర్ణయాలు తీసుకున్నారు. విలీనం విషయంలో వివాదాలు అవసరం లేదు. కులమతాలకు వ్యతిరేకంగా దేశ సమైక్యత కోసం ముందుకెళ్లాలి. సర్దార్ వల్లభాయ్ పటేల్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలి. సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత దేశంలో విలీనం అయింది. దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్కు స్వాతంత్రం వచ్చింది అని అన్నారు.
ఇదిలా ఉండగా.. బీజేపీ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీజేపీ కార్యాలయంలో జాతీయజెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్చార్జ్ సునీల్ బస్సల్, తరుణ్చుగ్, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అనంతరం, సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
తాజా వార్తలు
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!







