ఫుడ్ డెలవరీ బాయ్స్ బైక్ ప్రమాదాలను తగ్గించటంపై ట్రాఫిక్ పోలీసుల ఫోకస్
- September 20, 2022
దోహా: ఫుడ్ డెలవరీని ఆన్ టైమ్ లో డెలవరీ చేయాలన్న ఆతృతతో చాలా మంది డెలవరీ బాయ్స్ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ అయ్యాయి. దీంతో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ (జీడీటీ), ట్రాఫిక్ డిపార్ట్ మెంట్ ప్రమాదాల నివారణపై ఫోకస్ పెట్టింది. రెండు డిపార్ట్ మెంట్ లు కలిసి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. అనంతరం ట్రాఫిక్ అవేర్నెస్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ కల్నల్ జాబర్ మహ్మద్ రషీద్ ఒడైబా ఖతార్ రేడియోలో మాట్లాడారు. ఇటీవల కాలంలో ఫుడ్ డెలవరీ చేసే బాయ్స్ సంఖ్య పెరిగిందన్నారు. ఇది ఆర్థిక వ్యవస్థకు మంచిదేనని అయితే రోడ్డు ప్రమాదాలు కూడా పెరగటం ఆందోళన కలిగిస్తుందన్నారు. ఈ ప్రమాదాలను నివారించేందుకే వర్క్ షాప్ ఏర్పాటు చేసామన్నారు. చాలా మంది లోకేషన్ తెలుసుకునేందుకు మొబైల్ యాప్ చూస్తూ డ్రైవింగ్ చేయటం, ఫోన్లలో మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తుండటం కారణంగా ప్రమాదాలు జరగుతున్నాయన్నారు. 2021 మొదటి త్రైమాసికంతో పోలిస్తే 2022 మొదటి త్రైమాసికంలో మూడు రెట్ల ప్రమాదాలు ఎక్కువ అయ్యాయని అన్నారు. ఈ ప్రమాదాలను అరికట్టేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని...డెలివరీ బాయ్స్ కూడా జాగ్రత్తగా డ్రైవింగ్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- మస్కట్లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!