NTR హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్కు చంద్రబాబు ఫిర్యాదు..
- September 22, 2022
విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు. దశాబ్దాలుగా కొనసాగుతున్న పేరును మార్చడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు.. దీనిపై జోక్యం చేసుకోవాలని కోరారు. పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్కు వెళ్లిన చంద్రబాబు.. ఎన్టీఆర్ పేరు తొలగింపుపై గవర్నర్ హరిచందన్కు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పేర్లను తొలగిస్తామనడం మంచి సంప్రదాయం కాదంటూ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈమధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైనా గవర్నర్ హరిచందన్తో చర్చించినట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- సౌదీలో స్పోర్ట్స్ సెంటర్స్ కు కొత్త నిబంధనలు..పెర్ఫర్మాన్స్ డ్రగ్స్ పై నిషేధం..!!
- ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తుల విక్రయానికి 'Sooum' యాప్..!!
- ఇంటర్పోల్ వెతుకున్న బంగ్లాదేశ్ మాజీ పోలీస్ బాస్ యూఏఈలో అరెస్ట్..!!
- కువైట్లో వాహనం బోల్తా.. అగ్నిప్రమాదానికి గురై ఇద్దరు మృతి..!!
- మాదక ద్రవ్యాల అక్రమ రవాణాకు గట్టి దెబ్బ..దుబాయ్ కస్టమ్స్..!!
- అవినీతి నిరోధక డైరెక్టరేట్కు ఐఎస్ఓ 9001 ధృవీకరణ..!!
- భారత నూతన రాయబారిగా ప్రశాంత్ పిసే బాధ్యతల స్వీకరణ..!!
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష









