ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిపై ఒమన్ నిషేధం
- September 22, 2022ఒమన్: మరో మూడు నెలల్లో ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిని నిషేధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక మంత్రి కైస్ యూసెఫ్ తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం నం. 519/2022 ప్రకారం.. కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్ సంచులను దిగుమతి చేసుకోడం నిషేదమన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే RO1,000 ($2,597) జరిమానా విధించబడుదని హెచ్చరించారు.అదే ఉల్లంఘన పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందన్నారు. ఒమన్ ఎన్విరాన్మెంట్ అథారిటీ ఈ ఏడాది జనవరి 1న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్లపై నిషేధాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సింగిల్-యూజ్ బ్యాగ్ల స్థానంలో మందమైన 50-మైక్రాన్ బ్యాగ్లను చాలా షాపుల్లో కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నారు.
తాజా వార్తలు
- మే 14 నుంచి సౌదీ-యూకే ఎక్స్పో
- ‘క్షమాపణ డిక్రీ’పై మానవ హక్కుల సంఘాల ప్రశంసలు
- కీలక దశలోకి యూఏఈ-ఒమన్ రైల్వేలైన్..!
- యువ రైతులకు ప్రేరణగా యూఏఈ మొదటి మహిళా రైతు..!
- సోషల్ మీడియాలో పోస్ట్..బ్లాగర్కు ఐదేళ్ల జైలుశిక్ష
- మెసాయిద్లో అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ పార్క్ ప్రారంభం
- పాట్నాలోని ఓ హోటల్లో భారీ అగ్నిప్రమాదం..6 గురు మృతి..
- నాలుగో విడత ఎన్నికలు..ముగిసిన నామినేషన్ల గడువు
- తెలంగాణలో తీవ్ర వడగాలులు..
- T20 ప్రపంచకప్...బ్రాండ్ అంబాసిడర్గా బోల్ట్