ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిపై ఒమన్ నిషేధం
- September 22, 2022
ఒమన్: మరో మూడు నెలల్లో ప్లాస్టిక్ బ్యాగుల దిగుమతిని నిషేధిస్తున్నట్లు ఒమన్ ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని వాణిజ్య, పరిశ్రమలు, పెట్టుబడుల ప్రోత్సాహక మంత్రి కైస్ యూసెఫ్ తెలిపారు. మంత్రివర్గ నిర్ణయం నం. 519/2022 ప్రకారం.. కంపెనీలు, సంస్థలు, వ్యక్తులు ప్లాస్టిక్ సంచులను దిగుమతి చేసుకోడం నిషేదమన్నారు. నిషేధాన్ని ఉల్లంఘిస్తే RO1,000 ($2,597) జరిమానా విధించబడుదని హెచ్చరించారు.అదే ఉల్లంఘన పునరావృతం చేస్తే జరిమానా రెట్టింపు అవుతుందన్నారు. ఒమన్ ఎన్విరాన్మెంట్ అథారిటీ ఈ ఏడాది జనవరి 1న సింగిల్ యూజ్ ప్లాస్టిక్ షాపింగ్ బ్యాగ్లపై నిషేధాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. సింగిల్-యూజ్ బ్యాగ్ల స్థానంలో మందమైన 50-మైక్రాన్ బ్యాగ్లను చాలా షాపుల్లో కస్టమర్లకు ఉచితంగా అందిస్తున్నారు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







