రెస్టారెంట్లపై దాడులు.. భారీగా ఆహార పదార్థాలు ధ్వంసం

- September 23, 2022 , by Maagulf
రెస్టారెంట్లపై దాడులు.. భారీగా ఆహార పదార్థాలు ధ్వంసం

ఒమన్: ముత్రాలోని విలాయత్‌లో 32 రెస్టారెంట్లు, కేఫ్‌లపై మస్కట్ మున్సిపాలిటీ దాడులు చేసింది. ఈ దాడిలో భాగంగా 24 కిలోల పాడైన ఆహార పదార్థాలను ధ్వంసం చేసినట్లు అధికారులు తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదుల నేపథ్యంలో ఆహార నియంత్రణ విభాగం 32 రెస్టారెంట్లు, కేఫ్‌లను లక్ష్యంగా చేసుకుని తనిఖీలు నిర్వహించిందని మస్కట్ మున్సిపాలిటీ తెలిపింది. తనిఖీల్లో భాగంగా నిబంధనల ప్రకారం లేని 24 కిలోల ఆహార పదార్థాలను ధ్వంసం చేయడంతోపాటు తినేందుకు పనికిరాని ఆహార ఉత్పత్తులను జప్తు చేసినట్లు మున్సిపాలిటీ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com