విద్యార్థులపై దాడి ఘటనలో ఉపాధ్యాయుడు నిర్దోషి: విద్యాశాఖ
- September 24, 2022
బహ్రెయిన్: ఇద్దరు విద్యార్థులపై ఓ ఉపాధ్యాయుడు దాడి చేసినట్లు వీడియో ద్వారా తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. తాము చేసిన దర్యాప్తులో సదరు ఉపాధ్యాయుడు నిర్దోషి అని తేలిందని ప్రకటించింది. తమ విచారణలో ఓ విద్యార్థినే అసలు నిందితుడని తేలిందని పేర్కొంది. ఉపాధ్యాయుడిని అవమానించడం, రెచ్చగొట్టడం వంటి చర్యలకు విద్యార్థి పాల్పడ్డాడని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో విద్యార్థిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి విషయాల పట్ల తల్లిదండ్రులు, సోషల్ మీడియా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని.. విషయాన్ని నిర్ధారించుకోవడానికి సంబంధిత అధికారులకు తెలపాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఉపాధ్యాయుడు తన కుమారుడిపై, గాయాలతో బాధపడుతున్న మరో విద్యార్థిపై దాడి చేశారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు విడుదల చేసి వీడియో వైరల్ కావడంతో విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. ఈ ఘటన ఇసా టౌన్ ప్రైమరీ ప్రిపరేటరీ స్కూల్లో జరిగింది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







