విద్యార్థులపై దాడి ఘటనలో ఉపాధ్యాయుడు నిర్దోషి: విద్యాశాఖ
- September 24, 2022
బహ్రెయిన్: ఇద్దరు విద్యార్థులపై ఓ ఉపాధ్యాయుడు దాడి చేసినట్లు వీడియో ద్వారా తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్లో నిజం లేదని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. తాము చేసిన దర్యాప్తులో సదరు ఉపాధ్యాయుడు నిర్దోషి అని తేలిందని ప్రకటించింది. తమ విచారణలో ఓ విద్యార్థినే అసలు నిందితుడని తేలిందని పేర్కొంది. ఉపాధ్యాయుడిని అవమానించడం, రెచ్చగొట్టడం వంటి చర్యలకు విద్యార్థి పాల్పడ్డాడని విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో విద్యార్థిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇలాంటి విషయాల పట్ల తల్లిదండ్రులు, సోషల్ మీడియా వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని.. విషయాన్ని నిర్ధారించుకోవడానికి సంబంధిత అధికారులకు తెలపాలని మంత్రిత్వ శాఖ పిలుపునిచ్చింది. ఉపాధ్యాయుడు తన కుమారుడిపై, గాయాలతో బాధపడుతున్న మరో విద్యార్థిపై దాడి చేశారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు విడుదల చేసి వీడియో వైరల్ కావడంతో విద్యా మంత్రిత్వ శాఖ విచారణ ప్రారంభించింది. ఈ ఘటన ఇసా టౌన్ ప్రైమరీ ప్రిపరేటరీ స్కూల్లో జరిగింది.
తాజా వార్తలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం
- స్పీడ్ పోస్టు పేరుతో గంజాయి స్మగ్లింగ్..హైదరాబాద్లో భారీ రాకెట్ గుట్టురట్టు
- గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం







