ఖతార్లో బస్సులన్నిటికి ఏ.సి. సదుపాయం
- June 16, 2015
11 లేదా అంతకంటే ఎక్కువమంది ప్రయాణీకులను కలిగియున్న అన్ని వాహనాలూ, ఈ సంవత్సరం జులై 1 నుండి తప్పనిసరిగా ఏర్ కండీషనింగ్ను కలిగిఉండాలని ఖతార్ అంతర్గత (INTERIOR) మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఇన్సులేటెడ్ కిటికీలు, బంపరు మీద రిఫ్లెక్టివ్ స్టికర్లు, 50 మంది కంటే ఎక్కువ కపాసిటీ కలిగిన వాహనాల వెనుకభాగంలో పైవైపున బ్లింకింగ్ లైట్లను తప్పనిసరి చేసింది.
ఇంకా, కొత్త భద్రతా నియమావాళిలో భాగంగా, పాడచరులు, సైక్లిస్టులు భారీవాహనాల చక్రాల కిందపడి నలిగిపోవడాన్ని నిరోధించడానికి, సేఫ్టీబార్ను కలిగిఉంటే తప్ప, మిగిలిన అన్నిటి కింది భాగం నేల ఉపరితలంనుండి 55cmలోపే ఉండేలా నిబంధన విధించింది.
చూడబోతే, వేసవిలో, ఖతార్ మందుటెండల్లో స్వంతవాహనాలు లేక, నివాసం నుండి పనిచేసేచోటుకి కిక్కిరిసిన వాహనాలలో ఊపిరిపీల్చి వదలడానికి కూడా వీలులేని విధమైన వాహనాల్లో ప్రయాణించే సగటు ఉద్యోగులు ఇకపై కాస్త చల్లగా ఉపిరి పీల్చుకోగలరని ఆశిద్దాం!
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







