ఖతార్లో బస్సులన్నిటికి ఏ.సి. సదుపాయం
- June 16, 2015
11 లేదా అంతకంటే ఎక్కువమంది ప్రయాణీకులను కలిగియున్న అన్ని వాహనాలూ, ఈ సంవత్సరం జులై 1 నుండి తప్పనిసరిగా ఏర్ కండీషనింగ్ను కలిగిఉండాలని ఖతార్ అంతర్గత (INTERIOR) మంత్రిత్వ శాఖ తెలిపింది. అంతేకాకుండా ఇన్సులేటెడ్ కిటికీలు, బంపరు మీద రిఫ్లెక్టివ్ స్టికర్లు, 50 మంది కంటే ఎక్కువ కపాసిటీ కలిగిన వాహనాల వెనుకభాగంలో పైవైపున బ్లింకింగ్ లైట్లను తప్పనిసరి చేసింది.
ఇంకా, కొత్త భద్రతా నియమావాళిలో భాగంగా, పాడచరులు, సైక్లిస్టులు భారీవాహనాల చక్రాల కిందపడి నలిగిపోవడాన్ని నిరోధించడానికి, సేఫ్టీబార్ను కలిగిఉంటే తప్ప, మిగిలిన అన్నిటి కింది భాగం నేల ఉపరితలంనుండి 55cmలోపే ఉండేలా నిబంధన విధించింది.
చూడబోతే, వేసవిలో, ఖతార్ మందుటెండల్లో స్వంతవాహనాలు లేక, నివాసం నుండి పనిచేసేచోటుకి కిక్కిరిసిన వాహనాలలో ఊపిరిపీల్చి వదలడానికి కూడా వీలులేని విధమైన వాహనాల్లో ప్రయాణించే సగటు ఉద్యోగులు ఇకపై కాస్త చల్లగా ఉపిరి పీల్చుకోగలరని ఆశిద్దాం!
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







