బాంబు దాడి కేసులో నిర్దోషిగా తేలిన వ్యక్తి...తనను సోషల్ మీడియాలో తిట్టిన వారిపై దావా
- September 24, 2022
కువైట్: ఆత్మాహుతి దాడి కేసులో నిర్దోషిగా తేలిన ఓ వ్యక్తి...తనను నిందితుడంటూ సోషల్ మీడియాలో తిట్టిన వారందరినీ కోర్టుకు లాగాడు. తనకు ఆ బాంబు దాడితో ఎలాంటి సంబంధం లేకపోయిన దాదాపు 4 వేల మంది ట్విట్టర్ లో తనను అసభ్యంగా తిట్టారంటూ వారందరిపై దావా వేశాడు. వివరాల్లోకి వెళితే 2015 లో కువైట్లోని షియా మసీదుపై ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ జరిపిన ఈ దాడిలో 27 మంది చనిపోయారు. ఐతే టెర్రరిస్టులు వాడిన కారు యాజమాని అంటూ పోలీసులు ఓ వ్యక్తి అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేయటంతో కోర్టు లో విచారణ జరిగింది. ఉగ్రదాడికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసిన వ్యక్తి కి ఈ ఘటనతో ఎలాంటి సంబంధం లేదని తేల్చిన కోర్టు అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. కానీ చాలా మంది ట్విట్టర్ లో అతన్ని తిడుతూ కామెంట్లు చేశారు. దీంతో ఆ వ్యక్తి ట్విట్టర్ లో తిట్టిన 4 వేల మందిపై దావా వేశారు. వాళ్లందరినీ గ్రూపులు, గ్రూపులుగా విచారించాలని కోర్టును కోరాడు. వారి ఫోన్ నంబర్లను కూడా న్యాయస్థానానికి అందజేశాడు. దీంతో ఈ ఘటన కువైట్ లో సంచలనంగా మారింది. ఐతే కోర్టు ఈ దావాను విచారిస్తుందో లేదా వేచి చూడాలి.
తాజా వార్తలు
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం
- WTC ఫైనల్-2027 వేదిక, తేదీలు ఖరారు
- యూఏఈలో భారతీయ పాస్పోర్ట్ దరఖాస్తుదారులకు కొత్త హెచ్చరిక..
- ఇన్ఫోసిస్ కొత్త సీఈవోగా ఆశిష్ కుమార్ దాష్
- సిక్కిం ఘటనపై భారత్కు బహ్రెయిన్ సంఘీభావం..!!
- OMR32,000 కారు రిప్లేస్.. న్యాయం చేసిన ఒమన్ CPA..!!
- కువైట్లో భారత పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలు పునఃప్రారంభం..!!
- ఖతార్లో భారత రాయబారి విపుల్కు ఘనంగా వీడ్కోలు..!!
- దుబాయ్ ఇన్వైట్.. Dh3,000 రివార్డులు.. ఎలా పొందాలి?
- ఏపీకి కేంద్రం బంపర్ నజరానా







