రేణుగుంట కార్తికేయ ఆసుపత్రిలో భారీ అగ్ని ప్రమాదం..ముగ్గురు మృతి
- September 25, 2022
తిరుపతి: తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆదివారం తెల్లవారు జామున భగత్సింగ్ కాలనీలో నూతనంగా నిర్మించిన కార్తికేయ హాస్పిటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు యత్నించారు. దాదాపు మూడు గంటల పాటు శ్రమించి , ఇద్దర్ని కాపాడగలిగారు.
రేణిగుంటకు చెందిన డాక్టర్ రవిశంకర్ రెడ్డి తన భార్య డాక్టర్ అనంత లక్ష్మి కలిసి భగత్సింగ్ కాలనీలో నూతనంగా కార్తికేయ హాస్పిటల్ నిర్మించుకొని అక్కడే చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రి పైఅంతస్తులోనే వీరు నివాసం ఉంటున్నారు. రవిశంకర్ రెడ్డి , ఇద్దరు పిల్లలు సైతం వీరితోనే ఉంటున్నారు. కాగా ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని , మొత్తం హాస్పటల్ ను అంటుకున్నాయి. అగ్ని ప్రమాద విషయాన్నీ తెలుసుకున్న అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన చేరుకొని , మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రెస్క్యూ టీం అతి కష్టం మీద పైఅంతస్తుకు వెళ్లి రవిశంకర్రెడ్డి తల్లి, భార్య అనంతలక్ష్మిని ప్రాణాలతో కాపాడగలిగారు. మంటల వేడి, పొగ కారణంగా ఇద్దరు పిల్లలు ఊపిరి ఆడకచనిపోగా, డాక్టర్ రవిశంకర్ రెడ్డి మాత్రం మంటలకు చిక్కుకొని సజీవ దహనము అయ్యారు. ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా విషాదాన్ని నింపింది. ఒకే రోజు ముగ్గుర్ని పోగొట్టుకోవడంతో అనంత లక్ష్మి కన్నీరు మున్నీరు అవుతుంది.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







