ప్రపంచ పర్యాటక దినోత్సవం.. బహ్రెయిన్లో అనేక ఉచిత ఈవెంట్లు
- September 27, 2022
బహ్రెయిన్: 2022 ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా పర్యాటకులు, జాతీయులు, నివాసితులకు అనేక ఉచిత కార్యక్రమాలను అందించనున్నట్లు బహ్రెయిన్ టూరిజం అండ్ ఎగ్జిబిషన్ అథారిటీ (BTEA) ప్రకటించింది. సౌక్ అల్ మనామాలో పర్యటనలు, పడవ ప్రయాణాలు, గుర్రపు స్వారీ, రాక్ క్లైంబింగ్, క్రాఫ్ట్స్ వర్క్షాప్లు, అనేక వాటర్ స్పోర్ట్స్ కార్యక్రమాలు ఇందులో ఉన్నాయి. అలాగే క్రీడలు, అడ్వెంచర్స్ నుండి కళలు, సంస్కృతి వరకు అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలిపింది. సెప్టెంబరు 27 నుండి ప్రైవేట్ బస్సులలో పర్యాటకులు, సందర్శకుల కోసం మనామా సౌక్, ది అవెన్యూస్ మాల్, సిటీ సెంటర్ బహ్రెయిన్, సీఫ్ మాల్, బహ్రెయిన్ ఫోర్ట్ వంటి పర్యాటక ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలలో అనేక కార్యక్రమాలను ప్రారంభించినట్లు BTEA తెలిపింది. సందర్శకులు, పర్యాటకులకు బస్సు బయలుదేరే ప్రదేశాల వద్ద ఉచిత వినోద టిక్కెట్లను అందించనున్నారు. వీటితో హోటల్లు, ఇతర పర్యాటక కార్యక్రమాలను ఉచితంగా ఎంజాయ్ చేయొచ్చని అథారిటీ వెల్లడించింది. పర్యాటక బస్సులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సేవలు అందించనున్నాయి.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







