యూఏఈలో మోటారు బీమా క్లెయిమ్ల కోసం కొత్త డిజిటల్ ప్లాట్ఫారమ్
- September 27, 2022
యూఏఈ: మోటారు బీమా క్లెయిమ్లు మరింత వేగవంతంగా పరిష్కరించేందుకు యూఏఈలో కొత్త డిజిటల్ ప్లాట్ఫారమ్ అందుబాటులోకి వచ్చింది. బ్లాక్చెయిన్ టెక్నాలజీతో పనిచేయనున్న ఈ డిజిటల్ ప్లాట్ఫారమ్ అబుధాబిలో రూపొందించారు. ఆటోమోటివ్ ఆఫ్టర్సేల్స్ పరిశ్రమలో డిజిటల్, హార్డ్వేర్, మ్యాన్పవర్ సొల్యూషన్ల గ్లోబల్ ప్రొవైడర్ అయిన XA గ్రూప్ దీన్ని తయారు చేసింది. మంగళవారం ఈ అప్లికేషన్ ను అధికారికంగా లాంఛ్ చేశారు. అబుధాబి నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఎమిరేట్స్ ఇన్సూరెన్స్ కంపెనీ, యాస్ తకాఫుల్ , ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో సహా ప్రముఖ UAE బీమా సంస్థలు ఈ కొత్త డిజిటల్ అప్లికేషన్ ను వినియోగించనున్నట్లు XA గ్రూప్లోని MENA ఇన్సూరెన్స్ బిజినెస్ డైరెక్టర్ మినా సాహిబ్ తెలిపారు. మోటారు రికవరీ క్లెయిమ్ల సమయంలో జరిగే విస్తృతమైన ప్రక్రియలను ఇది మరింత వేగంగా పూర్తి చేస్తుందన్నారు. బీమాదారుల మధ్య పాలసీ డేటా, డాక్యుమెంటేషన్ ప్రక్రియలను కొత్త అప్లికేషన్ తో సులువుగా పూర్తవుతుందన్నారు. ముఖ్యంగా థర్డ్-పార్టీ క్లెయిమ్ల సమయంలో బీమా సంస్థ మరొక కంపెనీ నుండి నిధులను రికవరీ చేయవలసి వచ్చినప్పుడు, ఆ కమ్యూనికేషన్ అంతా డిజిటల్గా జరిగేలా చేస్తుందన్నారు. కొత్త డిజిటల్ ప్లాట్ఫారమ్ రెండు బీమా సంస్థల మధ్య జరిగే వ్యవహారాలల్లో పారదర్శకతను అందిస్తుందని ఎమిరేట్స్ ఇన్సూరెన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పాల్ మెక్లియోడ్ తెలిపారు.
తాజా వార్తలు
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- బహ్రెయిన్, యూఎస్ మధ్య AI భాగస్వామ్యం..!!
- పాస్పోర్ట్ కాకుండా..భారత పౌరసత్వాన్ని చట్టబద్ధంగా నిరూపించగల పత్రాలు ఏవి?
- 3 ఆఫ్రికా దేశాలకు ప్రయాణాలపై సౌదీ అరేబియా నిషేధం..!!
- విద్యా వోచర్లకు 'మారిఫ్' ద్వారా దరఖాస్తులకు ఆహ్వానం..!!
- తాజా పరిస్థితుల పై ఒమన్, ఇరాన్ చర్చలు..!!
- కువైట్ లో రోడ్ మెయింటనెన్స్ డ్రైవ్ వేగవంతం..!!
- రైలు ప్రయాణికులకు అలర్ట్.. లగేజీ నిబంధనల్లో మార్పులు
- తెలంగాణ రాష్ట్ర నూతన సీఎస్ గా ‘సంజయ్ జాజు’







