తిరుమల శ్రీవారి సేవలో ఏపీ సిఎం జగన్
- September 28, 2022
తిరుమల: సిఎం జగన్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు సీఎం జగన్కు వేదాశీర్వచనం అందించారు. తర్వాత నూతనంగా నిర్మించిన పరకామణి భవనాన్ని, అతిథి గృహాన్ని ప్రారంభించారు. అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పెద్దశేషవాహన సేవలో పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ప్రతిఏటా నిర్వహించే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీ. అందులో భాగంగా ధ్వజారోహణతో మంగళవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాల తొలి రోజున ఆయన శ్రీవారికి పట్టువస్త్రాలను తీసుకొచ్చారు.

తాజా వార్తలు
- సౌదీ విమానాశ్రయం, అరామ్కో కేంద్రంపై దాడులు చేశామని హూతీలు ప్రకటన
- సెప్టెంబర్ 1 నుంచి కువైట్లో విజిట్ వీసా, అబ్సెన్స్ పర్మిట్ పొడిగింపులు నిలిపివేత
- స్పెషలైజ్డ్ వింగ్స్ హెచ్ఓడీలతో డీజీపీ సి.వి.ఆనంద్
- దుబాయ్ రోబోట్యాక్సీ 40 లక్షల కిలోమీటర్లు పూర్తి.. ప్రయాణికుల సంతృప్తి 97 శాతం
- ట్రంప్ హెచ్చరికల పై ఘాటుగా స్పందించిన ఇరాన్
- బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫఖ్రూల్
- సోషల్ మీడియాలో ఎమిరాతీ మహిళలను అవమానించినందుకు UAE చర్యలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- ఖతార్లో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్..!!
- యూఏఈలో స్కూళ్లు రీ ఓపెన్.. పేరెంట్స్ పై పెరగనున్న ఖర్చుల భారం..!!







