యూఏఈలో ఈ తప్పు చేస్తే Dh20,000 జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష
- September 28, 2022
యూఏఈ: యూఏఈలో నివాసితులు, ప్రవాసులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. విలువైన వస్తువులు లేదా భారీ మొత్తంలో నగదు దొరికినప్పుడు వాటిని 48 గంటలలోపు సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. అలా కాకుండా తమతో పాటు ఉంచుకుంటే అది నేరంగా పరిగణించడం జరుగుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీనికిగాను 20వేల దిర్హాములు జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. 2021లో తీసుకొచ్చిన ఫెడరల్ డీక్రీ నం.31లోని అర్టికల్ 454 ప్రకారం ఇలా వేరే వాళ్లకు చెందిన నగదు లేదా ఖరీదైన వస్తువులను దాచుకునే వ్యక్తికి ఈ శిక్షను విధించడం జరుగుతుందని పేర్కొంది. అందుకే యూఏఈలోని ప్రవాసులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో భారీ జరిమానాతో పాటు రెండేళ్లు జైలు కెళ్లాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- అల్ రమ్లీ అగ్నిప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం..!!
- ఖతార్లో భారీగా పెరిగిన డిజిటల్ పేమెంట్స్..!!
- యూఏఈలో స్కూళ్లు రీ ఓపెన్.. పేరెంట్స్ పై పెరగనున్న ఖర్చుల భారం..!!
- రియాద్ విమానాశ్రయంలో ‘సైలెంట్ ఎయిర్పోర్ట్’ ప్రాజెక్ట్ ప్రారంభం..!!
- కువైట్లో కల్తీ ఆహారంపై అధికారుల కొరడా..!!
- ఇద్దరు పౌరులను ఆస్పత్రికి తరలించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- దుబాయ్లో డెలివరీ రైడర్లకు ఉచిత భోజనం..ఆర్టీఏ కీలక కార్యక్రమం
- జైవాన్ పేమెంట్స్ స్వీకరించిన తొలి ఎయిర్లైన్గా ఎతిహాద్ ఎయిర్వేస్
- చీనాబ్ బ్రిడ్జి పై తొలిసారి 100 కిమీ వేగంతో వందే భారత్
- రూపారెడ్డి హత్య కేసులో నిందితుల విలాసవంతమైన జీవనశైలి







