యూఏఈలో ఈ తప్పు చేస్తే Dh20,000 జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష

- September 28, 2022 , by Maagulf
యూఏఈలో ఈ తప్పు చేస్తే Dh20,000 జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష

యూఏఈ: యూఏఈలో నివాసితులు, ప్రవాసులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. విలువైన వస్తువులు లేదా భారీ మొత్తంలో నగదు దొరికినప్పుడు వాటిని 48 గంటలలోపు సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలి. అలా కాకుండా తమతో పాటు ఉంచుకుంటే అది నేరంగా పరిగణించడం జరుగుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీనికిగాను 20వేల దిర్హాములు జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. 2021లో తీసుకొచ్చిన ఫెడరల్ డీక్రీ నం.31లోని అర్టికల్ 454 ప్రకారం ఇలా వేరే వాళ్లకు చెందిన నగదు లేదా ఖరీదైన వస్తువులను దాచుకునే వ్యక్తికి ఈ శిక్షను విధించడం జరుగుతుందని పేర్కొంది. అందుకే యూఏఈలోని ప్రవాసులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో భారీ జరిమానాతో పాటు రెండేళ్లు జైలు కెళ్లాల్సి ఉంటుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com