యూఏఈలో ఈ తప్పు చేస్తే Dh20,000 జరిమానా.. రెండేళ్ల జైలు శిక్ష
- September 28, 2022
యూఏఈ: యూఏఈలో నివాసితులు, ప్రవాసులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. విలువైన వస్తువులు లేదా భారీ మొత్తంలో నగదు దొరికినప్పుడు వాటిని 48 గంటలలోపు సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించాలి. అలా కాకుండా తమతో పాటు ఉంచుకుంటే అది నేరంగా పరిగణించడం జరుగుతుందని యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్ వెల్లడించింది. దీనికిగాను 20వేల దిర్హాములు జరిమానాతో పాటు రెండేళ్ల జైలు శిక్ష ఉంటుందని తెలిపింది. 2021లో తీసుకొచ్చిన ఫెడరల్ డీక్రీ నం.31లోని అర్టికల్ 454 ప్రకారం ఇలా వేరే వాళ్లకు చెందిన నగదు లేదా ఖరీదైన వస్తువులను దాచుకునే వ్యక్తికి ఈ శిక్షను విధించడం జరుగుతుందని పేర్కొంది. అందుకే యూఏఈలోని ప్రవాసులు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో భారీ జరిమానాతో పాటు రెండేళ్లు జైలు కెళ్లాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల