కృష్ణంరాజు సంతాప సభ: 3 కోట్లు ఖర్చుతో భోజనాలు పెట్టించిన ప్రబాస్.!
- September 29, 2022
ఇటీవలే అనారోగ్యంతో సీనియర్ నటుడు కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయనకు సంతాపంగా సొంతూరు మొగల్తూరులో అభిమానుల కోసం ప్రబాస్ భోజనాలు పెట్టిస్తున్నారు. ఇందులో విశేషమేముంది అంటారా.?
ప్రబాస్ ఫ్యామిలీ భోజనం అంటే ఖచ్చితంగా అది ప్రత్యేకమే. ఏకంగా లక్ష మంది అభిమానులు ఈ భోజనాలకు విచ్చేయనున్నారనీ అంచనా వేస్తున్నారు. ప్రబాస్తో పాటూ, ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఈ సంతాప కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇప్పటికే హైద్రాబాద్ నుంచి మొగల్తూరు చేరుకున్న ప్రబాస్ కుటుంబ సభ్యులు అక్కడి భోజన కార్యక్రమాల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. కృష్ణంరాజు బతికున్నంత కాలం ఆయన ఇంటికి వచ్చే అతిధులకు చేసే మర్యాదల గురించి ఇప్పటికే పలు కథనాల ద్వారా విన్నాం.
అదే లెగసీని తన పెదనాన్నపై వున్న అభిమానంతో తాను కంటిన్యూ చేస్తున్నాడు ప్రబాస్. అందులో భాగంగానే తాజా సంతాప సభ కార్యక్రమానికి విచ్చేస్తున్న అభిమానులకు ఏకంగా మూడు రకాల బిరియానీ, ఎనిమిది రకాల వెజ్ ఐటెమ్స్, పలు రకాల స్వీట్స్, రెండు రకాల రొయ్యల కూర, మూడు రకాల చేపల పులుసులు.. ఇలా మెనూలో ఏ ఒక్కటీ తగ్గకుండా, అంతకు మించి అనే రేంజులో ఏర్పాట్లు చేస్తున్నాడట ప్రబాస్.
అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ భోజన ఏర్పాట్లు వుండబోతున్నాయనీ తెలుస్తోంది. ఈ మొత్తం ఏర్పాట్లకు ఏకంగా 3 కోట్ల వరకూ ప్రబాస్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- డేటింగ్ యాప్ ద్వారా వల.. నలుగురిపై కేసు నమోదు..!!
- ఖతార్ లో అధిక విద్యుత్ వినియోగ పరికరాల ఏర్పాటుపై అలెర్ట్..!!
- అక్టోబర్ 1న అల్ షహీద్ పార్క్ ఫేజ్-3 ప్రారంభం..!!
- సౌదీ బార్డర్ చట్ట ఉల్లంఘన.. సౌదీ సిటిజన్ అరెస్ట్..!!
- ఎమిరాటీ మహిళా దినోత్సవం 2026.. యూఏఈలో మహిళలకు ప్రత్యేక ఆఫర్లు..!!
- ల్యాబ్ నుంచి మార్కెట్కు సస్టైనబిలిటీ టెక్నాలజీలు..ముందుకు సాగుతున్న షార్జా
- ధోఫార్లో విషాదం.. పారాగ్లైడింగ్ ప్రమాదంలో అన్నాచెల్లెలు మృతి..!!
- పవర్ లిఫ్టింగ్లో మెరిసిన తెలంగాణ కుర్రాడు..మోదెం వంశీకి 4 పతకాలు!
- ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఫొటోగ్రాఫర్గా మారిన సీఎం చంద్రబాబు
- మూవీ టికెట్ రేట్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం!







