కృష్ణంరాజు సంతాప సభ: 3 కోట్లు ఖర్చుతో భోజనాలు పెట్టించిన ప్రబాస్.!
- September 29, 2022ఇటీవలే అనారోగ్యంతో సీనియర్ నటుడు కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే. ఆయనకు సంతాపంగా సొంతూరు మొగల్తూరులో అభిమానుల కోసం ప్రబాస్ భోజనాలు పెట్టిస్తున్నారు. ఇందులో విశేషమేముంది అంటారా.?
ప్రబాస్ ఫ్యామిలీ భోజనం అంటే ఖచ్చితంగా అది ప్రత్యేకమే. ఏకంగా లక్ష మంది అభిమానులు ఈ భోజనాలకు విచ్చేయనున్నారనీ అంచనా వేస్తున్నారు. ప్రబాస్తో పాటూ, ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఈ సంతాప కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఇప్పటికే హైద్రాబాద్ నుంచి మొగల్తూరు చేరుకున్న ప్రబాస్ కుటుంబ సభ్యులు అక్కడి భోజన కార్యక్రమాల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారట. కృష్ణంరాజు బతికున్నంత కాలం ఆయన ఇంటికి వచ్చే అతిధులకు చేసే మర్యాదల గురించి ఇప్పటికే పలు కథనాల ద్వారా విన్నాం.
అదే లెగసీని తన పెదనాన్నపై వున్న అభిమానంతో తాను కంటిన్యూ చేస్తున్నాడు ప్రబాస్. అందులో భాగంగానే తాజా సంతాప సభ కార్యక్రమానికి విచ్చేస్తున్న అభిమానులకు ఏకంగా మూడు రకాల బిరియానీ, ఎనిమిది రకాల వెజ్ ఐటెమ్స్, పలు రకాల స్వీట్స్, రెండు రకాల రొయ్యల కూర, మూడు రకాల చేపల పులుసులు.. ఇలా మెనూలో ఏ ఒక్కటీ తగ్గకుండా, అంతకు మించి అనే రేంజులో ఏర్పాట్లు చేస్తున్నాడట ప్రబాస్.
అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ భోజన ఏర్పాట్లు వుండబోతున్నాయనీ తెలుస్తోంది. ఈ మొత్తం ఏర్పాట్లకు ఏకంగా 3 కోట్ల వరకూ ప్రబాస్ ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఫ్లైదుబాయ్ విమాన సర్వీసులు రీషెడ్యూల్
- రోడ్లపై వరదనీరు.. కొనసాగుతున్న ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈకి భారీ రెయిన్ అలెర్ట్
- ఉమ్రా వీసా వ్యవధిపై సౌదీ కీలక ఉత్తర్వులు
- ఇరాన్పై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఒమన్
- కార్మికులకు కువైట్ శుభవార్త..!
- ఐదు రోజులపాటు తెలంగాణకు వర్ష సూచన
- ఇరాన్ పై ప్రతీకార దాడులకు దిగిన ఇజ్రాయెల్
- కొనసాగుతున్న లోక్సభ ఎన్నికల తొలిదశ పోలింగ్
- ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి: ప్రధాని మోడీ