టెహ్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదుల దాడి. 19 మంది మృతి
- October 02, 2022
            టెహ్రాన్: టెహ్రాన్ లోని సౌత్ ఈస్ట్రన్ లో ఓ పోలీస్ స్టేషన్ పై వేర్పాటు వాదులు ఆటాక్ చేశారు. బాంబులతో దాడి చేసిన అనంతరం కాల్పులకు దిగారు. ఈ ఘటనలో ఎలైట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ నలుగురు సహా మొత్తం 19 మంది చనిపోయారు. నమాజ్ కు వచ్చిన వారిలో కలిసిపోయిన దుండగులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో బాసిజీ బలగాలతో సహా 32 మంది గార్డ్ లు కూడా గాయపడ్డారు. ఐతే ఈ దాడి వేర్పాటు వాద గ్రూప్ చేసిందేనని ప్రభుత్వం ప్రకటించింది. కానీ హిజాబ్ కు సంబంధించిన పోలీస్ కస్టడీలో 22 ఏళ్ల యువతి మృతి చెందిన సంగతి తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ ఆందోళనల్లో భాగంగా నిరసనకారులు దాడి చేసి ఉంటారా అన్న అనుమానం కూడా వ్యక్తమవుతోంది. ఐతే విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ చర్చలు..వాణిజ్యం, భద్రత మరియు ప్రాంతీయ శాంతిపై దృష్టి..!!
 - బిగ్ టికెట్ డ్రాలో Dh25 మిలియన్ల గ్రాండ్ ప్రైజ్ను గెలుచుకున్న భారతీయ ప్రవాసుడు..!!
 - యూనిఫైడ్ GCC వీసాపై క్లారిటీ ఇచ్చిన సౌదీ పర్యాటక మంత్రి..!!
 - కువైట్ రైల్వే ప్రాజెక్ట్.. రైల్వే స్టేషన్ మొదటి దశ పూర్తి..!!
 - సముద్ర కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసిన ఖతార్..!!
 - ఒమన్ చోరీ కేసులలో పలువురి అరెస్టు..!!
 - తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
 - బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
 - ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
 - ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
 







