రియాద్ లో మొదటిసారిగా సౌదీ గేమ్స్. ఈ నెల 27 నుంచి ప్రారంభం
- October 02, 2022
రియాద్: అత్యంత వైభవంగా నిర్వహించనున్న సౌదీ గేమ్స్ ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ భారీ ఈవెంట్ కు తొలిసారి రియాద్ అతిథ్యమిస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. కింగ్ సల్మాన్ ఆధ్వర్యంలో జరిగే ఈ గేమ్స్ లో 6000 మంది మహిళ, పురుష అథ్లెట్స్ పాలొననున్నారు. కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ స్టేడియంలో గేమ్స్ నిర్వహిస్తారు. ఈ గేమ్స్ కు కింగ్ సల్మాన్ ఎంతో సపోర్ట్ చేస్తున్నారని స్పోర్ట్స్ మినిస్టర్ అబ్దుల్ అజీజ్ బిన్ తుర్కీ అల్-ఫైసల్ తెలిపారు. వారికి దేశం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఇక విజేతలకు భారీ మొత్తాన్ని నజరానాగా ఇవ్వనున్నారు. ఇందుకోసం సౌదీ ప్రభుత్వం 200 మిలియన్ రియాలను కేటాయించింది. బంగారు పతకం విజేతలకు మిలియన్, రజత పతక విజేతలు 3 00,000, కాంస్య విజేతలకు 1,00,000 రియాలు బహుమతి ఇవ్వనున్నారు. ఈ గేమ్స్ లో దేశం నలుమాలల నుంచి 200 కన్నా క్లబ్ లు పాల్గొననున్నాయి. ఐదు పారా-స్పోర్ట్స్ తో పాటు 45 వ్యక్తిగత , టీమ్ ఈవెంట్ లు సౌదీ గేమ్స్ లో ప్రేక్షకులను అలరించనున్నాయి.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







