ధృవీకరణ సేవల కోసం ఆన్లైన్ బుకింగ్: ఇండియన్ కాన్సులేట్
- October 04, 2022
దుబాయ్: ధృవీకరణ సేవల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఆన్లైన్ అపాయింట్మెంట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు దుబాయ్లోని కాన్సులేట్-జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అక్టోబర్ 10 నుంచి ఈ సిస్టమ్ అమల్లోకి రానుందని తెలిపింది. భారతీయ, విదేశీ పౌరుల కోసం ధృవీకరణ సేవలు కాన్సులేట్ ద్వారా SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు అవుట్సోర్స్ చేయబడ్డాయని, ఇది 1వ అంతస్తు, రూమ్ నంబర్ 102, 103 & 104, బిజినెస్ అట్రియం, ఔద్ మెథా, దుబాయ్లో ఉందని ఎంబసీ వెల్లడించింది. ధృవీకరణ సేవల కోసం SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో దరఖాస్తును సమర్పించడానికి దరఖాస్తుదారు ఇప్పుడు ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబరు 10 నుండి అత్యవసర కేసులు మినహా ఎటువంటి వాక్-ఇన్లు అనుమతించబడవని ఎంబసీ స్పష్టం చేసింది.
అపాయింట్మెంట్ బుకింగ్ ఇలా..
ఎ) IVS గ్లోబల్ వెబ్సైట్ https://www.ivsglobalattestation.com/సందర్శించండి.
బి) అపాయింట్మెంట్ ట్యాబ్ని క్లిక్ చేయండి
సి) సేవను ఎంచుకోండి. మీ ID ప్రకారం పర్సనల్ వివరాలను నమోదు చేయండి.
d) ధృవీకరణ కోసం, అపాయింట్మెంట్ వివరాలను పొందేందుకు ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







