ధృవీకరణ సేవల కోసం ఆన్లైన్ బుకింగ్: ఇండియన్ కాన్సులేట్
- October 04, 2022
దుబాయ్: ధృవీకరణ సేవల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఆన్లైన్ అపాయింట్మెంట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు దుబాయ్లోని కాన్సులేట్-జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అక్టోబర్ 10 నుంచి ఈ సిస్టమ్ అమల్లోకి రానుందని తెలిపింది. భారతీయ, విదేశీ పౌరుల కోసం ధృవీకరణ సేవలు కాన్సులేట్ ద్వారా SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు అవుట్సోర్స్ చేయబడ్డాయని, ఇది 1వ అంతస్తు, రూమ్ నంబర్ 102, 103 & 104, బిజినెస్ అట్రియం, ఔద్ మెథా, దుబాయ్లో ఉందని ఎంబసీ వెల్లడించింది. ధృవీకరణ సేవల కోసం SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో దరఖాస్తును సమర్పించడానికి దరఖాస్తుదారు ఇప్పుడు ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబరు 10 నుండి అత్యవసర కేసులు మినహా ఎటువంటి వాక్-ఇన్లు అనుమతించబడవని ఎంబసీ స్పష్టం చేసింది.
అపాయింట్మెంట్ బుకింగ్ ఇలా..
ఎ) IVS గ్లోబల్ వెబ్సైట్ https://www.ivsglobalattestation.com/సందర్శించండి.
బి) అపాయింట్మెంట్ ట్యాబ్ని క్లిక్ చేయండి
సి) సేవను ఎంచుకోండి. మీ ID ప్రకారం పర్సనల్ వివరాలను నమోదు చేయండి.
d) ధృవీకరణ కోసం, అపాయింట్మెంట్ వివరాలను పొందేందుకు ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి.
తాజా వార్తలు
- భారత్లో టీసీఎస్తో జత కట్టిన OpenAI
- 76ఏళ్ల వయస్సులో భార్యను హత్యచేసి.. మృతదేహం వద్ద కూర్చొని పక్కింట్లోకి ఫోన్..
- మే నెలలో కవిత కొత్త పార్టీ ఆవిర్భావం
- ఈనెల 26 నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు..
- వీసా ఇమ్మిగ్రేషన్ రూల్స్లో భారీ మార్పులు
- ఏప్రిల్ నుండి ఫేస్బుక్ మెసెంజర్ క్లోజ్..!!
- గాజా శాంతి, పునర్నిర్మాణ ప్రయత్నాలకు మద్దతు ..!!
- హోం బేస్డ్ గ్రోసరీ స్టోర్లు మూసివేత..!!
- రద్దీ నివారణకు ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..!!
- మదీనాలో వార్షిక పర్యాటక వ్యయం 22% వృద్ధి..!!









