ధృవీకరణ సేవల కోసం ఆన్లైన్ బుకింగ్: ఇండియన్ కాన్సులేట్
- October 04, 2022
దుబాయ్: ధృవీకరణ సేవల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఆన్లైన్ అపాయింట్మెంట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు దుబాయ్లోని కాన్సులేట్-జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అక్టోబర్ 10 నుంచి ఈ సిస్టమ్ అమల్లోకి రానుందని తెలిపింది. భారతీయ, విదేశీ పౌరుల కోసం ధృవీకరణ సేవలు కాన్సులేట్ ద్వారా SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు అవుట్సోర్స్ చేయబడ్డాయని, ఇది 1వ అంతస్తు, రూమ్ నంబర్ 102, 103 & 104, బిజినెస్ అట్రియం, ఔద్ మెథా, దుబాయ్లో ఉందని ఎంబసీ వెల్లడించింది. ధృవీకరణ సేవల కోసం SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో దరఖాస్తును సమర్పించడానికి దరఖాస్తుదారు ఇప్పుడు ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబరు 10 నుండి అత్యవసర కేసులు మినహా ఎటువంటి వాక్-ఇన్లు అనుమతించబడవని ఎంబసీ స్పష్టం చేసింది.
అపాయింట్మెంట్ బుకింగ్ ఇలా..
ఎ) IVS గ్లోబల్ వెబ్సైట్ https://www.ivsglobalattestation.com/సందర్శించండి.
బి) అపాయింట్మెంట్ ట్యాబ్ని క్లిక్ చేయండి
సి) సేవను ఎంచుకోండి. మీ ID ప్రకారం పర్సనల్ వివరాలను నమోదు చేయండి.
d) ధృవీకరణ కోసం, అపాయింట్మెంట్ వివరాలను పొందేందుకు ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







