ధృవీకరణ సేవల కోసం ఆన్లైన్ బుకింగ్: ఇండియన్ కాన్సులేట్
- October 04, 2022
దుబాయ్: ధృవీకరణ సేవల ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు ఆన్లైన్ అపాయింట్మెంట్ బుకింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు దుబాయ్లోని కాన్సులేట్-జనరల్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.అక్టోబర్ 10 నుంచి ఈ సిస్టమ్ అమల్లోకి రానుందని తెలిపింది. భారతీయ, విదేశీ పౌరుల కోసం ధృవీకరణ సేవలు కాన్సులేట్ ద్వారా SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్కు అవుట్సోర్స్ చేయబడ్డాయని, ఇది 1వ అంతస్తు, రూమ్ నంబర్ 102, 103 & 104, బిజినెస్ అట్రియం, ఔద్ మెథా, దుబాయ్లో ఉందని ఎంబసీ వెల్లడించింది. ధృవీకరణ సేవల కోసం SG IVS గ్లోబల్ కమర్షియల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్లో దరఖాస్తును సమర్పించడానికి దరఖాస్తుదారు ఇప్పుడు ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చని తెలిపింది. అక్టోబరు 10 నుండి అత్యవసర కేసులు మినహా ఎటువంటి వాక్-ఇన్లు అనుమతించబడవని ఎంబసీ స్పష్టం చేసింది.
అపాయింట్మెంట్ బుకింగ్ ఇలా..
ఎ) IVS గ్లోబల్ వెబ్సైట్ https://www.ivsglobalattestation.com/సందర్శించండి.
బి) అపాయింట్మెంట్ ట్యాబ్ని క్లిక్ చేయండి
సి) సేవను ఎంచుకోండి. మీ ID ప్రకారం పర్సనల్ వివరాలను నమోదు చేయండి.
d) ధృవీకరణ కోసం, అపాయింట్మెంట్ వివరాలను పొందేందుకు ఇమెయిల్ ఐడిని నమోదు చేయాలి.
తాజా వార్తలు
- ఇల్ నెస్ జాబితాను విడుదల చేసిన సౌదీ హెల్త్ మినిస్ట్రీ..!!
- ఒమన్ లో ఆకాశాన్నంటిన క్యాష్ లెస్ లావాదేవీలు..!!
- పెట్రోల్, డీజిల్ ధరలను ప్రకటించిన యూఏఈ..!!
- కువైట్ లో 57 వయోలేషన్స్, 71 వాహనాలు తొలగింపు..!!
- బుదైయా హత్య నిందితులకు జీవిత ఖైదు..!!
- ఖతార్లోఈ వారాంతంలో బలమైన గాలులు..!!
- మే 1న డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్న సీవీ ఆనంద్
- పడవలలో ఉన్న175 మంది గాజా కార్యకర్తలను అరెస్టు చేసిన ఇజ్రాయెల్
- అమెరికా-ఇరాన్ సంక్షోభం: హర్మూజ్ జలసంధి పై ముదురుతున్న పోరు
- ఘోర రోడ్డు ప్రమాదం..15 మంది దుర్మరణం.. 20 మందికి పైగా తీవ్ర గాయాలు









