ఒమన్ లో 140 శాతం పెరిగిన అంతర్జాతీయ విమానాల సంఖ్య
- October 04, 2022
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా జూలై 2022 చివరి వరకు 32,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు వచ్చాయని, 2021లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 142.1 శాతం పెరిగిందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నివేదిక స్పష్టం చేసింది. మస్కట్, సలాలా, సోహార్ విమానాశ్రయాల నుండి వచ్చే/బయలుదేరే అంతర్జాతీయ విమానాలు జూలై 2022 చివరి నాటికి 142.1 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మస్కట్, సలాలా, సోహార్, దుక్మ్ విమానాశ్రయాలకు వచ్చే/ బయలుదేరే మొత్తం ప్రయాణికుల సంఖ్య 4,907,599కి చేరుకోవడంతో విమానాశ్రయాల ద్వారా వచ్చేవారి సంఖ్య 187 శాతం పెరిగింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా బయలుదేరే వారి సంఖ్య 2021లో ఇదే కాలంతో పోలిస్తే జూలై చివరి వరకు 127 శాతం వృద్ధి నమోదైంది.
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ స్పీకర్తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







