ఒమన్ లో 140 శాతం పెరిగిన అంతర్జాతీయ విమానాల సంఖ్య
- October 04, 2022
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా జూలై 2022 చివరి వరకు 32,000 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలు వచ్చాయని, 2021లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 142.1 శాతం పెరిగిందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ నివేదిక స్పష్టం చేసింది. మస్కట్, సలాలా, సోహార్ విమానాశ్రయాల నుండి వచ్చే/బయలుదేరే అంతర్జాతీయ విమానాలు జూలై 2022 చివరి నాటికి 142.1 శాతం వృద్ధిని నమోదు చేశాయని నివేదిక తెలిపింది. నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. మస్కట్, సలాలా, సోహార్, దుక్మ్ విమానాశ్రయాలకు వచ్చే/ బయలుదేరే మొత్తం ప్రయాణికుల సంఖ్య 4,907,599కి చేరుకోవడంతో విమానాశ్రయాల ద్వారా వచ్చేవారి సంఖ్య 187 శాతం పెరిగింది. సుల్తానేట్ ఆఫ్ ఒమన్ విమానాశ్రయాల ద్వారా బయలుదేరే వారి సంఖ్య 2021లో ఇదే కాలంతో పోలిస్తే జూలై చివరి వరకు 127 శాతం వృద్ధి నమోదైంది.
తాజా వార్తలు
- మదీనాలో ఆరోగ్య , వాణిజ్య కార్యకలాపాలలో తనిఖీలు..!!
- మూడు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్సులు రద్దు..!!
- BD4,633 సైక్లింగ్..ప్రవాసురాలికి జైలుశిక్ష ఖరారు..!!
- యూఏఈలో లైసెన్స్ లేని, నకిలీ సంస్థలను ఎలా గుర్తించాలి?
- ఒమన్ ఎయిర్ ప్రయాణీకులలో 51% పెరుగుదల..!!
- ఇఫ్తార్కు ముందు అధిక వేగంపై హెచ్చరిక జారీ..!!
- హైదరాబాద్లోని హోటల్ లో పేలుడు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష









