జనవరి నుండి బహ్రెయిన్లో 1,000 డ్రగ్ కేసులు నమోదు
- October 04, 2022
బహ్రెయిన్: 2022 జనవరి నెల నుండి దాదాపు 1,000 డ్రగ్ కేసులు నమోదైనట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ నివేదిక తెలిపింది. గత మూడు నెలల్లోనే (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) డ్రగ్ కేసుల విచారణలో భాగంగా డెబ్బై మూడు మంది నిందితులను అరెస్టు చేయగా.. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ వేల బహ్రెయిన్ దినార్లు ఉంటుందని నివేదిక పేర్కొంది. రాజ్యంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్తో పాటు స్థానికంగా మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని అరికట్టడానికి డిపార్ట్మెంట్ రూపొందించిన తాజా వ్యూహాలే కేసుల సంఖ్య పెరిగేందుకుకు కారణమని నివేదిక స్పష్టం చేసింది. 2021లో 1,048 డ్రగ్స్ కేసులు నమోదు కాగా.. 1,229 మందిని అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, మస్జీదులు, సామాజిక క్లబ్లు.. వివిధ గవర్నరేట్లలో ఉపన్యాసాలు, ప్రదర్శనలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్ అజీజ్ మయూఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







