జనవరి నుండి బహ్రెయిన్లో 1,000 డ్రగ్ కేసులు నమోదు
- October 04, 2022
బహ్రెయిన్: 2022 జనవరి నెల నుండి దాదాపు 1,000 డ్రగ్ కేసులు నమోదైనట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ నివేదిక తెలిపింది. గత మూడు నెలల్లోనే (జూలై, ఆగస్టు, సెప్టెంబర్) డ్రగ్ కేసుల విచారణలో భాగంగా డెబ్బై మూడు మంది నిందితులను అరెస్టు చేయగా.. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ మార్కెట్ విలువ వేల బహ్రెయిన్ దినార్లు ఉంటుందని నివేదిక పేర్కొంది. రాజ్యంలోకి డ్రగ్స్ స్మగ్లింగ్తో పాటు స్థానికంగా మాదకద్రవ్యాల విక్రయం, వినియోగాన్ని అరికట్టడానికి డిపార్ట్మెంట్ రూపొందించిన తాజా వ్యూహాలే కేసుల సంఖ్య పెరిగేందుకుకు కారణమని నివేదిక స్పష్టం చేసింది. 2021లో 1,048 డ్రగ్స్ కేసులు నమోదు కాగా.. 1,229 మందిని అరెస్టు చేసినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖ నివేదిక తెలిపింది. పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు, మస్జీదులు, సామాజిక క్లబ్లు.. వివిధ గవర్నరేట్లలో ఉపన్యాసాలు, ప్రదర్శనలు నిర్వహించడం వంటి కార్యక్రమాల ద్వారా మాదకద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పిస్తున్నట్లు బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్ అజీజ్ మయూఫ్ తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









