మక్కాకు వెళుతుండగా ప్రమాదం.. 27 మంది యాత్రికులకు గాయాలు
- October 04, 2022
సౌదీ: పవిత్ర నగరమైన మక్కాకు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 27 మంది యాత్రికులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రి తరలించినట్లు సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. పశ్చిమ నగరం తైఫ్లో 50 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా ప్రమాదానికి గురైందని వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వైద్య సహాయం అందించాయన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 27 మందిని ఎనిమిది అంబులెన్స్ ల ద్వారా సమీపంలోని వైద్య సదుపాయాలకు తరలించినట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, అయితే బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడిందని రెడ్ క్రెసెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ స్పీకర్తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







