మక్కాకు వెళుతుండగా ప్రమాదం.. 27 మంది యాత్రికులకు గాయాలు
- October 04, 2022
సౌదీ: పవిత్ర నగరమైన మక్కాకు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 27 మంది యాత్రికులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రి తరలించినట్లు సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. పశ్చిమ నగరం తైఫ్లో 50 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా ప్రమాదానికి గురైందని వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వైద్య సహాయం అందించాయన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 27 మందిని ఎనిమిది అంబులెన్స్ ల ద్వారా సమీపంలోని వైద్య సదుపాయాలకు తరలించినట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, అయితే బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడిందని రెడ్ క్రెసెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- దగ్గు మందు మరణాల పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- తెలంగాణ: వచ్చే నెల నుంచి పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఫ్రీ..
- పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశంలో SANKALP పథక అమలు పై సమగ్ర సమీక్ష
- ఇక పై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్
- హైదరాబాద్: మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం
- ఉదయం మాజీ యువరాజు ఆండ్రూ అరెస్ట్..రాత్రికి విడుదల
- పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ
- ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల: మంత్రి లోకేష్
- ఇరాన్కు ట్రంప్ అల్టిమేటం..15 రోజుల డెడ్లైన్!
- పబ్లిక్ పాస్టింగ్ వయోలేషన్..జైలుశిక్ష లేదా BD100 ఫైన్..!!









