మక్కాకు వెళుతుండగా ప్రమాదం.. 27 మంది యాత్రికులకు గాయాలు
- October 04, 2022
సౌదీ: పవిత్ర నగరమైన మక్కాకు వెళుతున్న యాత్రికుల బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 27 మంది యాత్రికులు గాయపడ్డారని, వారిని ఆసుపత్రి తరలించినట్లు సౌదీ రెడ్ క్రెసెంట్ తెలిపింది. పశ్చిమ నగరం తైఫ్లో 50 మంది ప్రయాణికులతో బస్సు వెళుతుండగా ప్రమాదానికి గురైందని వెల్లడించింది. సమాచారం అందిన వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని వైద్య సహాయం అందించాయన్నారు. ప్రమాదంలో గాయపడ్డ 27 మందిని ఎనిమిది అంబులెన్స్ ల ద్వారా సమీపంలోని వైద్య సదుపాయాలకు తరలించినట్లు తెలిపింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, అయితే బస్సు ప్రమాదవశాత్తు బోల్తా పడిందని రెడ్ క్రెసెంట్ అధికారులు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- IPL 2026: ముంబై పై హైదరాబాద్ ఘన విజయం
- యూరప్ పర్యటనలో యూఏఈలో ప్రధాని మోదీ స్టాప్ఓవర్ చేసే అవకాశం
- యూఏఈలో పర్యటిస్తున్న బహ్రెయిన్ రాజు
- ఇనార్బిట్ మాల్ లో ‘మైఖేల్’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన
- 1000 కోట్ల నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం!
- ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు..అధికారం ఆ పార్టీలదే...పీపుల్స్ పల్స్ సంచలన ఎగ్జిట్ పోల్స్
- రోడ్డు దాటుతుండగా వాహనం ఢీ..దుబాయ్ పోలీసుల హెచ్చరిక జారీ..!!
- FIFA U-17 ప్రపంచ కప్ ఖతార్ 2026 టోర్నమెంట్ తేదీల ప్రకటన..!!
- 6,640 విద్యుత్ కనెక్షన్ల తొలగింపు..సమీక్షకు ఎంపీ పిలుపు..!!









