దుబాయ్లో హిందూ దేవాలయం ప్రారంభం
- October 06, 2022
దుబాయ్: దుబాయ్లో నూతనంగా నిర్మించిన హిందూ దేవాలయాన్ని బుధవారం భక్తులకోసం అధికారికంగా తెరిచారు. ఈ ఆలయం బెబెలీ అలీ ప్రాంతంలో ఉంది. ఈ ఆలయాన్ని మినిస్టర్ ఆఫ్ టాలరెన్స్ మంత్రి షేక్ నహ్యాన్ బిన్ ముబారక్ అల్ నహ్యాన్ ముఖ్యఅతిథిగా, యూఏఈలోని భారత రాయబారి సంజయ్ సుధీర్ గౌరవ అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో సామాజిక నియంత్రణ, లైసెన్సింగ్ ఏజెన్సీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CDA) ఒమర్ అల్-ముత్తన్న, హిందూ దేవాలయం దుబాయ్ ధర్మకర్త రాజు ష్రాఫ్ పాల్గొన్నారు. 200 మంది ప్రముఖులు, రాయబారులు, స్థానిక సంఘం నాయకులు ఈ ప్రారంభ వేడుకలకు హాజరయ్యారు. ఈ నూతన ఆలయం దీపావళి ఉత్సవాల తరువాత అందరికీ అందుబాటులో ఉంటుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. దుబాయ్లోని జెబెల్ అలీలోని వర్షిప్ విలేజ్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయం కోసం యూఏఈ ప్రభుత్వం 2019లో భూమిని కేటాయించింది. అయితే కోవిడ్ మహమ్మారి కారణంగా ఆలయ నిర్మాణానికి మూడేళ్లు పట్టింది. గురు గ్రంథ్ సాహిబ్తో పాటు , వెంకటేశ్వర స్వామి,శివుడు, కృష్ణుడు, గణేష్, షిరిడీ సాయి, బాబా,మహాలక్ష్మి తో సహా 16 మంది దేవత,దేవతామూర్తి లను ఈ ఆలయంలో ఉంచారు.ఈ ఆలయాన్ని సందర్శించాలనుకునేవారు ఆలయ వెబ్సైట్ ద్వారా ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. సందర్శకులు, భక్తులు వారి పేరు, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, సందర్శకుల సంఖ్యను అందించిన తర్వాత క్యూఆర్ టెక్నాలజీతో అరగంటలో స్లాట్లను బుక్ చేసుకోవచ్చని ఆలయ వర్గాలు వెల్లడించాయి.





తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







