ట్రక్కులు ఢీకొని ఇద్దరు ఈజిప్షియన్లు మృతి
- October 06, 2022
కువైట్: సబా అల్-అహ్మద్ ప్రాంతంలో రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఈజిప్షియన్లు మరణించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు ట్రక్కలు ఢీకొన్న ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, భద్రత, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. ఓ ట్రక్కు డ్రైవర్, అతని సహచరుడు అప్పటికే గాయాలతో మరణించారని, మరో ట్రక్కు డ్రైవర్కు గాయాలవ్వగా సమీప ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతులను ఈజిప్షియన్లుగా గుర్తించామన్నారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదన్నారు. భద్రత, అగ్నిమాపక సిబ్బంది.. రెండు ట్రక్కులను రోడ్డుపై నుండి తొలగించి వాహనాల రాకపోకలను కోసం క్లియర్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్పోర్ట్లో వరద నీరు
- సౌదీ అరేబియాలో కేంద్ర మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ పర్యటన
- ‘అరబ్ రీడింగ్ ఛాలెంజ్’ విజేతలతో షేక్ మొహమ్మద్ భేటీ
- నేపాల్కు మూడో యూఏఈ సహాయక విమానం.. సెర్చ్ అండ్ రెస్క్యూ బృందం రాక
- అబ్దుల్ రెహ్మాన్ యూసుఫ్ అల్-ఖరదావీకి యూఏఈ అధ్యక్షుడి క్షమాభిక్ష
- షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీవన ప్రమాణం AED 20,000కు పెంపు
- భారత, క్యూబా రాయబారులతో ఫుజైరా క్రౌన్ ప్రిన్స్ భేటీ







