ట్రక్కులు ఢీకొని ఇద్దరు ఈజిప్షియన్లు మృతి
- October 06, 2022
కువైట్: సబా అల్-అహ్మద్ ప్రాంతంలో రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఈజిప్షియన్లు మరణించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు ట్రక్కలు ఢీకొన్న ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, భద్రత, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. ఓ ట్రక్కు డ్రైవర్, అతని సహచరుడు అప్పటికే గాయాలతో మరణించారని, మరో ట్రక్కు డ్రైవర్కు గాయాలవ్వగా సమీప ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతులను ఈజిప్షియన్లుగా గుర్తించామన్నారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదన్నారు. భద్రత, అగ్నిమాపక సిబ్బంది.. రెండు ట్రక్కులను రోడ్డుపై నుండి తొలగించి వాహనాల రాకపోకలను కోసం క్లియర్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









