ట్రక్కులు ఢీకొని ఇద్దరు ఈజిప్షియన్లు మృతి
- October 06, 2022
కువైట్: సబా అల్-అహ్మద్ ప్రాంతంలో రెండు ట్రక్కులు ఢీకొన్న ఘటనలో ఇద్దరు ఈజిప్షియన్లు మరణించారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు ట్రక్కలు ఢీకొన్న ఘటనపై సమాచారం అందగానే అగ్నిమాపక సిబ్బంది, భద్రత, అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నాయన్నారు. ఓ ట్రక్కు డ్రైవర్, అతని సహచరుడు అప్పటికే గాయాలతో మరణించారని, మరో ట్రక్కు డ్రైవర్కు గాయాలవ్వగా సమీప ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. మృతులను ఈజిప్షియన్లుగా గుర్తించామన్నారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదన్నారు. భద్రత, అగ్నిమాపక సిబ్బంది.. రెండు ట్రక్కులను రోడ్డుపై నుండి తొలగించి వాహనాల రాకపోకలను కోసం క్లియర్ చేసినట్లు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?
- స్టాటిన్ మెడికేషన్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ వార్న్..!!









