థాయిలాండ్లో భయానక ఘటన.. కాల్పుల్లో 34 మంది మృతి
- October 06, 2022
థాయిలాండ్: థాయిలాండ్లో భయానక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఇవాళ విచక్షణారహితంగా కాల్పులు జరిపి 34 మంది ప్రాణాలు తీశాడు. వారిలో 22 మంది చిన్నారులు ఉన్నారు.థాయిలాండ్లోని నోంగ్ బువా లమ్ ఫూ ప్రావిన్స్ లోని ప్రీ స్కూల్ చైల్డ్ డే కేర్ సెంటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మాజీ పోలీసు అధికారే ఈ దారుణానికి పాల్పడినట్లు గుర్తించామన్నారు. అతడిని ఉన్నతాధికారులు కొన్ని రోజుల క్రితమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు.
అతడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించామని వివరించారు. కాల్పులతో పాటు కొందరిని నిందితుడు కత్తితో పొడిచి చంపినట్లు చెప్పారు. అతడు ఈ ఘటనకు ఎందుకు పాల్పడ్డాడన్న విషయంపై స్పష్టత లేదని తెలిపారు. ఓ ట్రక్కులో నిందితుడు తిరుగుతూ కనపడ్డాడని అన్నారు. పలు ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించామని చెప్పారు. కాగా, థాయిలాండ్ లో ఇటువంటి కాల్పుల ఘటనలు పెరిగిపోతున్నాయి. నఖోన్ రాట్చసిమాలో 2020లో ఓ ఆర్మీ అధికారి కాల్పులు జరిపి 21 మందిని చంపాడు. ఆ ఘటనలో చాలా మందికి గాయాలయ్యాయి.
తాజా వార్తలు
- The Seventh Concept returns with its flagship 1-on-1 basketball experience -ANTA Hoop Fest 2.0 in Dubai
- ప్రపంచ మార్కెట్లో ప్రవేశించడానికి ఏపీ గేట్ వేగా ఉంటుంది: సీఎం చంద్రబాబు
- విద్యార్థులకు గుడ్ న్యూస్..స్కూళ్లలోనే ఆధార్ అప్డేట్
- దమాక్ ప్రాపర్టీస్ నుంచి మరో అద్భుతం – 'దమాక్ ఐలాండ్స్ 2' ప్రారంభం
- మస్కట్ లో ఏపీ వాసి మృతి
- ఢిల్లీ బాంబు బ్లాస్ట్ విషయంలో మా సాయం అక్కర్లేదు..మార్కో రూబియో
- డబ్ల్యూటిఐటిసి 2025 కౌంట్డౌన్ పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- కువైట్ లో ఇద్దరు భారతీయులు మృతి..!!
- జిసిసి 'వన్-స్టాప్' ట్రావెల్ సిస్టమ్ ప్రారంభం..!!
- రియాద్ లో ఆఫాక్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అకాడమీ ప్రారంభం..!!







