యూఏఈ వెళ్లే భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం..
- October 06, 2022
యూఏఈ: యూఏఈ వెళ్లే 70 దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది. ఇక గల్ఫ్ దేశాల పౌరులకు యూఏఈ వెళ్లేందుకు వీసా అవసరం లేదు. వారికి ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. కనుక యూఏఈ వెళ్లే 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉన్న 70 దేశాలతో పాటు GCC దేశాల వారికి వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, మిగత దేశాల వారికి తప్పనిసరిగా ప్రీ-ట్రావెల్ వీసా కావాల్సిందే. ఇక భారతీయుల విషయానికి వస్తే.. మనోళ్లకు సాధారణ ఇండియన్ పాస్పోర్టు తో పాటు యూఎస్ జారీ చేసిన విజిట్ వీసా లేదా అమెరికన్ గ్రీన్కార్డు లేదా బ్రిటన్ జారీ చేసిన రెసిడెన్సీ వీసా లేదా ఈయూ నివాస వీసా ఉండాలి. ఈ నాలుగు సందర్భాల్లో మాత్రమే భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉంటుంది.
ఇక ఇలా పొందిన వీసాతో ఆ దేశంలో 14 రోజుల పాటు బస చేసేందుకు వీలు ఉంటుంది. అలాగే మరో 14 రోజుల పాటు వీసా వాలీడిటిని పొడిగించుకునే వెసులుబాటు కూడా వీసాదారులకు ఉంది. ఇలా మొత్తంగా ఆ వీసాపై 28 రోజుల పాటు యూఏఈలో ఉండొచ్చు. అయితే, ఈ వీసా పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటంటే.. వీసాదారుడి పాస్పోర్ట్ తప్పకుండా 6 నెలల వాలీడిటిని కలిగి ఉండాలి.అలాగే యూఎస్, ఈయూ, యూకే రెసిడెన్సీ వీసాల గడువు కూడా 6 నెలలు ఉండాల్సిందే. వీసాదారుడు యూఏఈలో కాలుపెట్టినప్పటి నుంచి వాటి గడువులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.ఇక వీసా కాస్ట్ వచ్చేసి 14 రోజులకు గాను 120 దిర్హాములు ఉంటుంది. మరో 14 రోజులు పొడిగించుకునేందుకు అదనంగా 250 దిర్హాములు చెల్లించాలి.
తాజా వార్తలు
- IPL 2026: పంజాబ్ కింగ్స్ జైత్రయాత్రకు బ్రేక్..
- లొంగిపోయిన మావోలకు ఉద్యోగాలు…తెలంగాణ కీలక నిర్ణయం
- విశాఖపట్నంలోని ఫ్యాషన్ ప్రియులకు శుభవార్త
- చమురు కూటమికి యూఏఈ గుడ్ బై..!
- హర్మూజ్ను తెరవడానికి ఇరాన్ మూడు షరతులు
- పెరిగిన ధరలతో విమానాలు నడపడం కష్టం..కేంద్రానికి విమాన సంస్థల లేఖ
- శ్రీవారి భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..
- తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్..ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం...
- కార్మికుల బదిలీకి యజమాని ఆమోదం తప్పనిసరి..!!
- షార్జాలో మహిళల కోసం ప్రత్యేక బీచ్ పార్క్ సిద్ధం..!!









