యూఏఈ వెళ్లే భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం..
- October 06, 2022
యూఏఈ: యూఏఈ వెళ్లే 70 దేశాల వారికి వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంటుంది. ఇక గల్ఫ్ దేశాల పౌరులకు యూఏఈ వెళ్లేందుకు వీసా అవసరం లేదు. వారికి ఫ్రీ ఎంట్రీకి అనుమతి ఉంటుంది. కనుక యూఏఈ వెళ్లే 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉన్న 70 దేశాలతో పాటు GCC దేశాల వారికి వీసాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ, మిగత దేశాల వారికి తప్పనిసరిగా ప్రీ-ట్రావెల్ వీసా కావాల్సిందే. ఇక భారతీయుల విషయానికి వస్తే.. మనోళ్లకు సాధారణ ఇండియన్ పాస్పోర్టు తో పాటు యూఎస్ జారీ చేసిన విజిట్ వీసా లేదా అమెరికన్ గ్రీన్కార్డు లేదా బ్రిటన్ జారీ చేసిన రెసిడెన్సీ వీసా లేదా ఈయూ నివాస వీసా ఉండాలి. ఈ నాలుగు సందర్భాల్లో మాత్రమే భారతీయులకు 'వీసా ఆన్ అరైవల్' సౌకర్యం ఉంటుంది.
ఇక ఇలా పొందిన వీసాతో ఆ దేశంలో 14 రోజుల పాటు బస చేసేందుకు వీలు ఉంటుంది. అలాగే మరో 14 రోజుల పాటు వీసా వాలీడిటిని పొడిగించుకునే వెసులుబాటు కూడా వీసాదారులకు ఉంది. ఇలా మొత్తంగా ఆ వీసాపై 28 రోజుల పాటు యూఏఈలో ఉండొచ్చు. అయితే, ఈ వీసా పొందేందుకు కొన్ని షరతులు ఉన్నాయి. అవేంటంటే.. వీసాదారుడి పాస్పోర్ట్ తప్పకుండా 6 నెలల వాలీడిటిని కలిగి ఉండాలి.అలాగే యూఎస్, ఈయూ, యూకే రెసిడెన్సీ వీసాల గడువు కూడా 6 నెలలు ఉండాల్సిందే. వీసాదారుడు యూఏఈలో కాలుపెట్టినప్పటి నుంచి వాటి గడువులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది.ఇక వీసా కాస్ట్ వచ్చేసి 14 రోజులకు గాను 120 దిర్హాములు ఉంటుంది. మరో 14 రోజులు పొడిగించుకునేందుకు అదనంగా 250 దిర్హాములు చెల్లించాలి.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







