సౌదీలో 135 మంది స్మగ్లర్లు అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- October 07, 2022
రియాద్ : రాజ్యంలోకి భారీ మొత్తంలో డ్రగ్స్ను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన పలు ప్రయత్నాలను విఫలం చేసినట్లు సౌదీ సరిహద్దు గార్డ్స్ తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం 135 మంది డ్రగ్ స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. ఇందులో 36 మంది పౌరులు, 99 మంది అక్రమ నివాసితులు ఉన్నారన్నారు. నజ్రాన్, జజాన్, అసిర్, తబుక్, తూర్పు ప్రావిన్స్లోని బోర్డర్లలో మొత్తం 64.4 టన్నుల డ్రగ్స్ ను పెట్రోలింగ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని సౌదీ బోర్డర్ గార్డ్స్ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి కల్నల్ మిస్ఫర్ అల్-కిరైనీ తెలిపారు. ఇందులో 1009 కిలోల హషీష్, 62,000 యాంఫెటమైన్ మాత్రలు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ అవసరమయ్యే 425,620 మాత్రలు ఉన్నాయన్నారు. స్మగ్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అల్-కిరైనీ వెల్లడించారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









