సౌదీలో 135 మంది స్మగ్లర్లు అరెస్ట్.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
- October 07, 2022
రియాద్ : రాజ్యంలోకి భారీ మొత్తంలో డ్రగ్స్ను స్మగ్లింగ్ చేసేందుకు చేసిన పలు ప్రయత్నాలను విఫలం చేసినట్లు సౌదీ సరిహద్దు గార్డ్స్ తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం 135 మంది డ్రగ్ స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. ఇందులో 36 మంది పౌరులు, 99 మంది అక్రమ నివాసితులు ఉన్నారన్నారు. నజ్రాన్, జజాన్, అసిర్, తబుక్, తూర్పు ప్రావిన్స్లోని బోర్డర్లలో మొత్తం 64.4 టన్నుల డ్రగ్స్ ను పెట్రోలింగ్ బృందాలు స్వాధీనం చేసుకున్నాయని సౌదీ బోర్డర్ గార్డ్స్ జనరల్ డైరెక్టరేట్ ప్రతినిధి కల్నల్ మిస్ఫర్ అల్-కిరైనీ తెలిపారు. ఇందులో 1009 కిలోల హషీష్, 62,000 యాంఫెటమైన్ మాత్రలు, మెడికల్ ప్రిస్క్రిప్షన్ అవసరమయ్యే 425,620 మాత్రలు ఉన్నాయన్నారు. స్మగ్లర్లపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వీలుగా వారిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు అల్-కిరైనీ వెల్లడించారు.
తాజా వార్తలు
- దుబాయ్ మాల్ మెట్రో స్టేషన్ వద్ద బస్సు, టాక్సీ సర్వీస్ రోడ్డుకు తాత్కాలిక మూసివేత..
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్..
- షార్జాలో భారత కాన్సులర్ శిబిరానికి విశేష స్పందన.. 200 మందికి పైగా సేవలు వినియోగం
- కుప్పంలోనూ త్వరలో గోల్డ్ ఉత్పత్తి: సీఎం చంద్రబాబు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!







