ఒమన్లో ప్రజలను మోసగిస్తున్న ప్రవాసుల ముఠా అరెస్టు
- October 07, 2022
మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్లో నకిలీ ఫారాలు సృష్టించి ప్రజలను మోసగిస్తున్న ఏడుగురు సభ్యులు గల ప్రవాసుల ముఠాను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) తెలిపారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్, మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో సోషల్ మీడియా ద్వారా మోసం చేసిన ఆరోపణలపై సీబ్లోని విలాయత్లో ఏడుగురు వ్యక్తుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల బ్యాంకు సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో నకిలీ ఫారాలను నిందితులు తయారు చేశారని వివరించారు. అనుమానాస్పద కమ్యూనికేషన్లు, మెసేజ్లకు ప్రతిస్పందించవద్దని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు. అలాంటివి అనుమానస్పద విషయాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తాజా వార్తలు
- దక్షిణాఫ్రికా చేతిలో ఘోరంగా ఓడిపోయిన భారత్
- వాహనాల పైకప్పుల పై కూర్చోవడం డేంజర్, క్రైమ్..!!
- సోహార్లో చోరీ కేసులో ఇద్దరు అరెస్టు..!!
- దుబాయ్ లో బెగ్గర్ అరెస్ట్.. నగదు చూసి పోలీసులు షాక్..!!
- సౌదీ అరేబియాలో 14,893 మంది బహిష్కరణ..!!
- ట్రాన్సిట్, టూరిజం పాలసీపై సమీక్షకు సన్నాహాలు..!!
- ప్రవాసుల లా సేవల పై కువైట్ బార్ అసోసియేషన్ సీరియస్..!!
- భారతీయ విశ్వవిద్యాలయాలు ‘రోబోడాగ్’ నుంచి ఏం నేర్చుకోవాలి: BITS వైస్ ఛాన్సలర్ రాంగోపాల్ రావు
- ట్రంప్ టారిఫ్ దెబ్బ, దిగుమతుల పై 15% సుంకం ప్రకటింపు
- టీబీజేపీ ప్రెసిడెంట్ రాంచందర్ రావు అరెస్ట్..









