ఒమన్లో ప్రజలను మోసగిస్తున్న ప్రవాసుల ముఠా అరెస్టు
- October 07, 2022
మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్లో నకిలీ ఫారాలు సృష్టించి ప్రజలను మోసగిస్తున్న ఏడుగురు సభ్యులు గల ప్రవాసుల ముఠాను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) తెలిపారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్, మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో సోషల్ మీడియా ద్వారా మోసం చేసిన ఆరోపణలపై సీబ్లోని విలాయత్లో ఏడుగురు వ్యక్తుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల బ్యాంకు సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో నకిలీ ఫారాలను నిందితులు తయారు చేశారని వివరించారు. అనుమానాస్పద కమ్యూనికేషన్లు, మెసేజ్లకు ప్రతిస్పందించవద్దని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు. అలాంటివి అనుమానస్పద విషయాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తాజా వార్తలు
- భారత్ ఇంధన సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించింది: ప్రధాని మోదీ
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..







