ఒమన్లో ప్రజలను మోసగిస్తున్న ప్రవాసుల ముఠా అరెస్టు
- October 07, 2022
మస్కట్: విలాయత్ ఆఫ్ సీబ్లో నకిలీ ఫారాలు సృష్టించి ప్రజలను మోసగిస్తున్న ఏడుగురు సభ్యులు గల ప్రవాసుల ముఠాను అరెస్టు చేసినట్లు రాయల్ ఒమన్ పోలీసులు (ఆర్ఓపి) తెలిపారు. జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్, మస్కట్ గవర్నరేట్ పోలీస్ కమాండ్ సహకారంతో సోషల్ మీడియా ద్వారా మోసం చేసిన ఆరోపణలపై సీబ్లోని విలాయత్లో ఏడుగురు వ్యక్తుల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజల బ్యాంకు సమాచారాన్ని సేకరించే లక్ష్యంతో నకిలీ ఫారాలను నిందితులు తయారు చేశారని వివరించారు. అనుమానాస్పద కమ్యూనికేషన్లు, మెసేజ్లకు ప్రతిస్పందించవద్దని రాయల్ ఒమన్ పోలీసులు ప్రజలను కోరారు. అలాంటివి అనుమానస్పద విషయాలను తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.
తాజా వార్తలు
- తిరుమలకు చేరుకున్న ఉపరాష్ట్రపతి సి.పి.రాధకృష్ణన్
- IPL 2026: ఢిల్లీ పై బెంగళూరు ఘన విజయం
- ఎమిరేట్స్ A380లో స్టార్లింక్ వై-ఫై ప్రారంభం
- వందేళ్ల వేడుకలో గుడ్ న్యూస్…ఏయూకి రూ.500 కోట్లు
- శాంతికి రష్యా కృషి…పుతిన్ కీలక ప్రకటన
- పెట్రోల్, డీజిల్ సరఫరా పై స్పష్టత: ఎంపీ బాలశౌరి
- ఒకే కుటుంబంలో నలుగురు మృతి..కారణం బిర్యానా? పుచ్చకాయ?
- వినోదాల కేంద్రంగా ఇనార్బిట్ మాల్
- సింగపూర్లో మంత్రి సత్యకుమార్తో ప్రవాస తెలుగు సమాజం ముఖాముఖీ కార్యక్రమం
- బహ్రెయిన్ లో మానవ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టు..!!









